Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చాట్ జీపీటీ సాయంతో హైక్వాలిటీ నకిలీ నోట్లదందా.. అష్టాంగ యోగాగురువు సహా ఏడుగురు అరెస్ట్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం గణనీయంగా పెరిగిన క్రమంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిస్ యూజ్ చేస్తున్నవారు కూడా పెరిగిపోయారు. ముఖ్యంగా క్రిమినల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా అటువంటి సంఘటన నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక భారీ నకిలీ కరెన్సీ రాకెట్ ను చేదించటంతో వెలుగులోకి వచ్చింది.

నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠా అరెస్ట్

అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 2.38 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏడుగురు నిందితులను, ఒక మహిళను అరెస్టు చేస్తారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పోలీసులు అహ్మదాబాద్‌లోని అమ్రైవాడిలో టొరెంట్ పవర్ సమీపంలో ఒక ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని వాహన తనిఖీలలో భాగంగా ఆపారు .

Fake Currency with ai support fake currency Racket Busted In Surat ahmedabad China Link Found

ఈ వాహనంలో రూ.2.10కోట్ల నకిలీ 500రూపాయల నోట్లు

ఈ వాహనంలో రూ.2.10కోట్ల నకిలీ 500రూపాయల నోట్లు లభించాయి. ఈ వ్యవహారంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో సూరత్‌లోని ఒక ఇంటిపై దాడి చేసి, రూ.28లక్షల నకిలీ నోట్లతో పాటు ప్రింటర్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, కటింగ్ మెషీన్‌లు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిలో అష్టాంగ యోగా గురువు ప్రదీప్ జొటంగియా, ముఖేష్ తుమ్మర్, అశోక్ ధంజి మావానీ, రమేష్ బాలర్, దివ్యేష్ రానా, భరత్ కకాడియా ఉన్నారు.

దర్యాప్తులో షాకింగ్ విషయాలు

సూరత్‌లోని కటార్‌గామ్‌కు చెందిన ఒక మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ముఖేష్ తుమ్మర్ ఈ రాకెట్‌కు నాయకుడని, గత నాలుగు నెలలుగా సూరత్‌లోని ఒక నివాస భవనంలో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నాడని తేలింది. చైనా నుంచి "RBI", "భారత్" గుర్తులున్న సెక్యూరిటీ-త్రెడ్ పేపర్‌ను ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకున్నట్టు చెప్పారు.

చాట్ జిపిటి ద్వారా రీసెర్చ్

దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం చాట్ జిపిటి ద్వారా రీసెర్చ్ చేసినట్టు చెప్పారు.నకిలీ నోట్లకు నిజమైన రూపాన్ని ఇవ్వడానికి ఫోటో-ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాధనాలని ఉపయోగించారు. ఇది వారి అధునాతన ముద్రణ పద్ధతులను స్పష్టం చేస్తుంది. అహ్మదాబాద్ డీసీపీ అజిత్ రాజియన్ ఈ ఆపరేషన్‌పై మాట్లాడుతూ, నకిలీ కరెన్సీ సరఫరా, దాని ముద్రణ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిందని తెలిపారు.

ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్!
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్!

నకిలీ నోట్ల చలామణిలో అంతర్జాతీయ సంబంధాలు ఉండవచ్చని అంచనా

సాంకేతికత, అంతర్జాతీయ వనరులను ఉపయోగించి హై క్వాలిటీ నోట్లను తయారు చేసినట్టు, నోట్ల నాణ్యతను పెంచడానికి నిందితులు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ఆర్థిక విపత్తు తప్పింది అని ఆయన వివరించారు. ఈ కేసులో రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా, ఈ నకిలీ నోట్ల చలామణిలో అంతర్జాతీయ సంబంధాలు ఉండవచ్చని డీసీపీ అంచనా వేశారు. ఆ కోణంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నిందితులందరిపై డీసీబీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ముఠా ఇతర ఆర్థిక లావాదేవీలను దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+