fake: నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ్ ?, బెంగళూరు టూ ?, ఎక్కడెక్కడ ?
బెంగళూరు/మంగళూరు: దొంగనోట్ల ముఠా సభ్యులు ఎప్పుడు ఎక్కడ నకిలీ నోట్లు చలామణి చెయ్యాలి అని స్కెచ్ లు వేస్తూనే ఉన్నారు. దొంగనోట్లు చలామణి చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. అయితే అనేక ప్లాన్ లు వేస్తున్న నిందితులు దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. అయితే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
Doctor: ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసి నాలుగో భార్య?, ఆపరారేయ్ !
కర్ణాటకలోని మంగళూరు నగరంలోని నంటూరు సమీపంలో ద్విచక్ర వాహనంపై రూ. 500 రూపాయలన నకిలీనకిలీ నోట్లను తరలిస్తున్న ఇద్దరు నిందితులను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బంట్వాళ బి.సి.రోడ్డుకు చెందిన నిజాముద్దీన్ (32), మంగళూరులో నివాసముంటున్న రజీమ్ యానె రఫీ (31) అనే నిందితులను అరెస్టు చేసినట్లు మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు.
మంగళూరులోని కద్రి పోలీస్స్టేషన్ నంతూరు సమీపంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా నిందితులు పోలీసులకు దొరికిపోయి అతివేగంతో వాహనం నడిపారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇద్దరిని వెంబడించి చివరికి వారిని పట్టుకుని తనిఖీ చేశారు. అప్పుడు రూ 500 రూపాయల నకిలీ నోట్లు పోలీసులకు చిక్కిపోయాయి.
Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?
వెంటనే ఇద్దరు నిందితులను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన డేనియల్ నుంచి నకిలీ కరెన్సీ నోట్లు వచ్చాయని, వాటిని చెలామణి చేసేందుకు వెళ్తున్నామని నిందితులు పోలీసులకు తెలిపారు.పాండేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు ఓ వ్యక్తిపై దాడి చేసి అతని స్కూటర్ను లాక్కెళ్లారు. తర్వాత అదే వాహనంలో నకిలీ నోట్లను రవాణా చేస్తున్నారని మంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.