మేఘాలయాలో ఫొని బీభత్సం.. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం
ఒడిశా, పశ్చిమబెంగాల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాలను అతలాకుతలం చేస్తున్న ఫణి తుఫాను తాజాగా మేఘాలయ రాష్ట్రాన్ని తాకింది. రాష్ట్ర్రంలోని తూర్పు ఖాసీ, దక్షిణ ఖాసీ లోని హిల్ ప్రాంతాలగుండా ప్రయాణించింది. దీంతో ఆయా జిల్లాల్లోని సుమారు 20 గ్రామాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయ్యాయి. తుఫాను ప్రభావంలో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా విద్యుత్ భవనాలు, చెట్లతో పాటు ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయని హోంశాఖ అధికారులు తెలిపారు.అయితే ఎలాంటీ ప్రాణ నష్టం కలగలేదు. కాగా గాలుల ప్రభావం రాజధాని షిల్లాంగ్ సహ పలు ప్రాంతాల్లో పెద్దగా నష్టమేమి కాలేదని తెలిపారు. కాగా అధిక వర్షం కారణంగా మేఘాలయాలోని బోగ్గు గనుల్లోకి భారీగా నీరు చేరింది.













Click it and Unblock the Notifications