దౌర్జన్యం: బలవంతంగా మూత్రం తాగించి, చెప్పులతో దాడి!
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో దారుణం జరిగింది. పంటకోతల సందర్భంగా తమ పొలాల్లో పనిచేసేందుకు రాలేదన్న కారణంతో కొంతమంది అగ్రకులాలకు చెందిన వ్యక్తులు ఓ దళిత వ్యక్తి చేత బలవంతంగా మూత్రం తాగించారు. అజంపూర్ బిసౌలియా అనే గ్రామంలో ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. సీతారాం వాల్మీకి(43) అనే ఓ రైతు తనకున్న కొద్ది పొలంలో గోధమ సాగు చేశాడు. పంటకోతకు రావడంతో కోత పనుల్లో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో గ్రామంలో ఠాకూర్ వర్గానికి చెందిన కొంతమంది తమ పొలంలో కోత పనులకు రావాలని అతన్ని బలవంతం చేశారు. తమ పంటకోతలు అయ్యాకే నీ పంటకోత మొదలుపెట్టాలని చెప్పారు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో దౌర్జన్యానికి దిగారు.

'విజయ్ సింగ్ నన్ను పంటకోతకు రమ్మన్నాడు. ఆ సమయంలో వాతావరణం బాగా లేకపోవడంతో.. తనకు బదులు ఆ పని నన్ను చేయమన్నాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో నన్ను కొట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు, పదేపదే నా మీసాలను లాగుతూ, బలవంతంగా మూత్రం తాగించారు.' అని బాధితుడు సీతారాం వాపోయాడు.
అక్కడితో ఆగకుండా తన కాళ్లు చేతులు కట్టేసి గ్రామంలోకి లాక్కెళ్లి.. చెప్పులతో తనపై దాడి చేశారని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాంపై దాడిని పోలీసులు ధ్రువీకరించారు. ప్రాథమిక విచారణలో దాడి జరిగిన మాట వాస్తవమేనని తేలిందన్నారు. నిందితులు విక్రమ్ సింగ్, సోంపాల్ సింగ్, పింకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుర్రంపై ఎక్కినందుకు దళితుడిపై దాడి:
రాజస్థాన్ లోని భిల్వారా గ్రామంలో ఓ దళిత కుటుంబం పెళ్లి ఊరేగింపుపై అగ్రకుల వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. ఒక దళితుడు గుర్రంపై ఎక్కి ఊరేగడమేంటి అన్న ఆగ్రహంతోనే దాడికి పాల్పడినట్టు సమాచారం. నిందితులపై కేసులు నమోదు చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications