ఎర్రకోట హింస తర్వాత మళ్లీ రైతుల ట్రాక్టర్ల ర్యాలీ -ఆగస్టు 15న భారీగా -లక్నోలోనూ ఢిల్లీ తరహా దిగ్బంధం
జాతీయ పండుగ నాడే రైతు ఉద్యమం మరో కొత్త మలుపు తిరగబోతున్నది. గణతంత్రదినోత్సవమైన జనవరి 26న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడం, ఎర్రకోటపై జాతీయ జెండాను తొలగించి, సిక్కుల జెండాను పెట్టడం, ఆ దెబ్బతో ప్రభుత్వానికి, రైతులకు మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోవడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు రైతులు మరో భారీ ట్రాక్టర్ల పరేడ్ నిర్వహించనున్నారు...
వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో మోదీ సర్కార్ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురాగా, వాటిని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులుచేస్తోన్న నిరసనలు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్నాయి. రాజకీయంగా బీజేపీని దెబ్బతీస్తూ, డిమాండ్ సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తోన్న రైతులు మరోసారి ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధమవుతున్నారు.

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆగస్టు 15వ తేదీన ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ సోమవారంనాడు ప్రకటించారు. 14వ తేదీన రైతులు ట్రాక్టర్లపై ఘాజిపూర్ సరిహద్దులకు చేరుకుంటారని, 15న అక్కడే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని చెప్పారు. రెండు జిల్లాల నుంచి ట్రాక్టర్లు వెళ్తాయని చెప్పారు. అవసరమైతే యూపీ రాజధాని లక్నోలోని రోడ్లను కూడా దిగ్బంధించి, ఢిల్లీ తరహాలో నిరసన శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు.
రైతుల గోడును అసలేమాత్రం పట్టించుకోని బీజేపీకి వ్యతిరేకంగా 'మిషన్ యూపీ' సహా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లోనూ రైతులు ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల రాష్ట్రాలకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. మిషన్ యూపీలో భాగంగా తొలి సభను సెప్టెంబర్ 5న ముజఫర్నగర్లో నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని రాకేశ్ టికాయత్ చెప్పారు. కాగా,
రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు తీసిన ట్రాక్టర్ల పరేడ్ లో హింస చెలరేగడానికి బాధ్యత కేంద్రానిదేనని, ఎర్రకోటపై జాతీయ జెండాను తొలగించింది రైతులు కారని, బీజేపీ కార్యకర్తలేననే విషయం అందరికీ తెలుసని రాకేశ్ టికాయత్ అన్నారు. నిజానికి ట్రాక్టర్ ర్యాలీ తీయడం చెడ్డ పనేమీ కాదని, జాతీయ జండాతో ట్రాక్టర్లు నడపడం వల్ల ప్రజల్లో జాతీయతాభావం కూడా పెరుగుతుందని టికాయత్ వ్యాఖ్యానించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications