ఇందిర ఎమర్జెన్సీ నాడే మోదీకి షాకిచ్చేలా -జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్ భవన్ల ముట్టడికి రైతులు
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా తాము మాత్రం వెనుకడుగు వేసేదే లేదంటూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు కంటే మొండిగా రైతలు నిరసనలను కొనసాగిస్తునే ఉన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదు. దీంతో రైతులు తమ నిరసనల్ని తీవ్రతరం చేశారు..
Recommended Video
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 26న రైతులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ నివాసాలైన రాజ్భవన్లను ముట్టడించాలని కిసాన్ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. 40 రైతు సంఘాల ఐక్యవేదిక అయిన కిసాన్ సంయుక్త మోర్చా ప్రతినిధులు ఈ మేరకు ఉద్యమకార్యాచరణ వెల్లడించారు.

ఈనెల 26న అన్ని రాజ్ భవన్ ల ఎదుట రైతులు నల్ల జెండాలతో నిరసనలు తెలుపుతారని, గవర్నర్ నివాసాలను ముట్టడిస్తారని, కొవిడ్ నిబందనలు పాటిస్తూ, శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని కిసాన్ సంయుక్త మోర్ఛా తెలిపింది. నిరసనల్లో భాగంగానే గవర్నర్ల ద్వారా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మెమోరండాలు పంపుతామని పేర్కొంది. కాగా,
రాజ్ భవన్ ల ముట్టడి నేపథ్యంలో ఈనెల 26ను 'సేవ్ ఫార్మింగ్, సేవ్ డెమోక్రసీ' దినంగా పాటించనున్నట్లు రైతు సంఘాల నేతలు వెల్లడించారు. 1975లో సరిగ్గా అదే రోజు(జూన్ 26న) అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారని, ప్రస్తుతం మోదీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని, ప్రజాస్వామ్యాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆరోజున రాజ్ భవన్ల ముట్టడికి పిలుపుఇచ్చినట్లు రైతుల సంఘాల నేతలు చెప్పారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications