మీటూ ఎఫెక్ట్ : భారత్ రాగానే మంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా..?
మహిళలపై లైంగిక వేధిపులకు పాల్పడిన ప్రముఖలు పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో చాలామంది పెద్ద మనుషుల్లో ఆందోళన నెలకొంది. మీటూ ఉద్యమం ఊపందుకోవడంతో సినీ రాజకీయ వర్గాల్లో కలవరం మొదలైంది. ఈ క్రమంలోనే విదేశీవ్యవహారాల సహాయశాఖ మంత్రి ఎంజే అక్బర్ పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. ప్రస్తుతం ఆయన పదవికే ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.
ఇక విశ్వసనీయ సమాచారం మేరకు ఎంజే అక్బర్ పదవికి గండం తప్పేట్టు లేదు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మంత్రి వర్యులు ప్రస్తుతం నైజీరియాలో ఉన్నారు. ఆదివారం ఆయన భారత్కు తిరిగి రానున్నారు. ఇదిలా ఉంటే విశ్వసనీయ సమాచారం మేరకు సీనియర్ మంత్రులు అక్బర్పై వేటువేస్తారని చర్చించుకుంటున్నారు. అది కూడా భారత్కు చేరుకోగానే ఆయన రాజీనామా చేస్తారనే వార్త ఢిల్లీలో జోరుగా ప్రచారంలో ఉంది. అయితే అక్బర్ రాజీనామాపై బీజేపీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఎలాంటి విచారణ లేకుండానే అక్బర్ను మంత్రిగా తొలగిస్తే ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనే కోణంలో కూడా బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది.

ఇదిలా ఉంటే అక్టోబర్ 9న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను అక్బర్ పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పకుండా దాటవేశారు. అయితే అక్బర్ పై చాలామంది మహిళలు లైంగిక దాడులు చేశారని ఆరోపణలు చేశాక ఆయనపై నజర్ సాధించింది కేంద్రం. ఇవన్నీ మీటూ ఉద్యమంతో బయటకొచ్చాయి.












Click it and Unblock the Notifications