ఇంటికొచ్చినట్లుంది : అమేథీ ప్రజలతో రాహుల్, ఓడిపోయిన తర్వాత తొలిసారి...
అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడమే కాదు .. పెట్టిన కోట అయిన అమేథీ నుంచి రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాహుల్ను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మట్టి కరిపించారు. ఈ క్రమంలో అమేథీ ప్రజలకు దగ్గరయ్యేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ అమేథీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

అమేథీలో పర్యటన
కాంగ్రెస్ కార్యకర్యలు, శ్రేణులను కలిశారు రాహుల్ గాంధీ. ప్రజలను సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి అమేథీలో అడుగిడిన రాహుల్ .. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అమేథీకి రావడంతో మళ్లీ తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని పేర్కొన్నారు. ఏంతైనా తన పాత నియోజకవర్గమే కదా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అమేథీ నుంచి రాహుల్ మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 2004, 2009, 2014లో ఇక్కడినుంచి ఎంపీగా విజయబావుగా ఎగరవేశారు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014లో బీజేపీ నుంచి పోటీచేసి .. ఓడిపోయిన స్మృతి అమేథీ ప్రజలతో మమేకవుతూ వచ్చారు. దీంతో ఆమెకు పట్టం కట్టారు.

ఇదీ విషయం ..
మరోవైపు తన ట్విట్టర్ ఫాలొవర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరుకోవడంతో యూజర్లకు రాహుల్ ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని అమేథీ ప్రజలతో పంచుకుంటానని నిన్ననే ట్వీట్ చేశారు రాహుల్. కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు, మద్దతుదారులతో గడుపుతానని తెలిపారు. చెప్పినట్టుగానే అమేథీ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు నెలన్నర తర్వాత అమేథీలో .. సోషల్ మీడియా వేదిక జరిగిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ కంచుకోటలో మళ్లీ ఆ పార్టీ జెండా ఎగరేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

రాజీనామాస్త్రం ...
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత పదవీ చేపట్టేందుకు కూడా విముఖత చూపారు. పార్టీ నేతలకు దూరంగా ఉన్నారు. అధ్యక్ష పదవీకి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సోనియా, ప్రియాంక, ఇతర సీనియర్ నేతలు చెప్పినా వినిపించుకోలేదు. అధ్యక్ష పదవీకి రాజీనామా చేయడంతో .. తాత్కాలిక అధ్యక్షుడగా మోతిలాల్ వోరాను కాంగ్రెస్ పార్టీ నియమించిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి అధ్యక్షుడిని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) ఎన్నుకోనుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాహుల్ రాజీనామా చేసి ట్వీట్ చేశాక .. ఫ్రొపైల్ కూడా మార్చివేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా మార్చారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications