చిదంబరం సంతకం మాత్రమే చేశారు, కార్తీకి సంబంధం లేదు: కపిల్ సిబల్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం ఎలాంటి తప్పూ చేయలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) ఐఎన్ఎక్స్ మీడియాకు కియరెన్స్ ఇచ్చిందని, ఆ తర్వాత ఆర్థికమంత్రిగా చిదంబరం కేవలం సంతకం మాత్రమే చేశారని చెప్పుకొచ్చారు.
కార్తీ చిదంబరం పాత్ర ఉందని ఎఫ్ఐపీబీ అధికారులు పేర్కొనలేదు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పాత్ర ఉందని ఎఫ్ఐపీబీ అధికారులు ఎక్కడా పేర్కొనలేదని న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అందరు ఎఫ్ఐపీబీ సెక్రటరీలను ప్రశ్నించిందని.. అయితే, వారిలో ఒక్కరూ కూడా కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తమను సంప్రదించారని చెప్పలేదని తెలిపారు.

బెనిఫిషియరీ కంపెనీ అక్రమంగా ఆమోదం పొందిందని, ఐటీ డిపార్ట్మెంట్ తప్పుడు సమాచారం ఇచ్చిందనేవి ఈడీ ఆరోపణలని సిబల్ వ్యాఖ్యానించారు. తమపై కార్తీ చిదంబరం ఎలాంటి ఒత్తిడి చేసినట్లుగానీ ఎఫ్ఐపీబీ అధికారులు ఎవరూ కూడా చెప్పలేదని అన్నారు.
అంతేగాక, అడ్వంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ లిమిటెడ్(ఏఎస్సీపీఎల్)తో కార్తీ చిదంబరానికి ఎలాంటి సంబంధం లేదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయం, ఆస్తులు అని ఈడీ వీరి ఆస్తులను అటాచ్ చేసిందని తెలిపారు. అలా ఈడీ అనడానికి ఏదైనా సంబంధం ఉందా? అని కపిల్ సిబల్ ప్రశ్నించారు.
కేసు విషయంలో చిదంబరాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా సమాచారాన్ని లీక్ చేసి సంచలనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం నేరం చేశారంటున్న ఈడీ ఎలాంటి ఆధారాలను చూపడం లేదని అన్నారు. మొత్తం 26.5గంటలపాటు విచారించిన సీబీఐ.. చిదంబరాన్ని కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగలేదని ఆరోపించారు. చిదంబరంను ట్విట్టర్ అకౌంట్ ఉందా? అని ఈడీ ప్రశ్నించిందని చెప్పారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 2018లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు మనం 2019 ఆగస్టులో ఉన్నాం. పిటిషనర్కు వ్యతిరేకంగా ఉన్న డాక్యుమెంట్లను సీల్డ్ కవర్లో న్యాయస్థానం ముందు ఉంచాలని సిబల్ వ్యాఖ్యానించారు. ప్రొసీడింగ్స్ను సంచలనం చేసేందుకు మీడియాకు లీకులు ఇస్తోందంటూ ఈడీపై సిబల్ మండిపడ్డారు. దర్యాప్తును మంత్రగత్తె వేట, మీడియా విచారణగా మార్చకూడదని వ్యాఖ్యానించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications