కేంద్రమంత్రి అనుప్రియతో అనుచిత ప్రవర్తన, 158 మందిపై కేసు
లక్నో: కేంద్రమంత్రి, అప్నాదల్ మహిళా నేత అనుప్రియా పటేల్తో అనుచితంగా ప్రవర్తించినందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు 158 మంది పైన కేసు నమోదు చేశారు. ప్రతాప్గర్ జిల్లాలోని రోడ్డు షో సందర్భంగా ఆమెతో వారు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇంట్లో నిర్బంధం: వివాదంలో కేంద్రమంత్రి అనుప్రియస్థానిక నాయకుడు వినోద్ దుబే, మరో 157 మంది పైన కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత రాత్రి వీరు అనుప్రియా పటేల్తో అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. రాణిగంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.
ఆదివారం నాడు అప్నాదళ్ కార్యకర్తలు రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో కేంద్రమంత్రి అయిన అనుప్రియా పటేల్ పాల్గొన్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న వివేక్ దుబే, ఆయన అనుచరులు ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు.