Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ సీఎంను అవమానిస్తూ పోస్టర్లు, అధికార పార్టీ లీడర్స్ మీద ఎఫ్ఐఆర్, దెబ్బ కొడితే ?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కించపరిచి వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అతికించిన కొద్ది రోజుల తర్వాత శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో కేపీసీసీ నాయకుడి మీద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. జేడీఎస్‌ నేతల ఫిర్యాదు మేరకు కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) కార్యదర్శి ఎస్‌. మనోహర్‌తో పాటు మరో నలుగురిపై బెంగళూరులోని శ్రీరాంపుర పోలీసులు కేసు నమోదు చేశారు.

నవంబర్ 20వ తేదీన బెంగళూరులోని రాజాజీనగర్, శేషాద్రిపురం తదితర ప్రాంతాల్లో మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి వ్యతిరేకంగా ముద్రించిన వివిధ పోస్టర్లు అతికించారు. మాజీ సీఎం, జేడీఎస్ లీడర్ కుమారస్వామిని కరెంట్ దొంగ అంటూ అవహేళన చేస్తూ జేడీఎస్ కార్యాలయాల కాంపౌండ్‌ కు కూడా పోస్టర్లు వేశారు. జేడీఎస్ నేతలు బుధవారం బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి.దయానంద్‌ను కలిసి కేపీసీసీ కార్యదర్శి మనోహర్ తో ఇతరుల మీద ఫిర్యాదు చేశారు.

FIR against KPCC leaders who put up posters in Bengaluru defaming HD Kumaraswamy

జేడీఎస్‌ నేత రమేశ్‌ గౌడ ఫిర్యాదు మేరకు బెంగళూరులోని శ్రీరాంపుర పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుల మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేపీసీసీ కార్యదర్శి ఎస్ మనోహర్, కార్తీక్ డి, దర్శన్ గౌడ, అర్జున్ గౌడ, సంతోష్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని శ్రీరాంపుర పోలీసులు వెల్లడించారు. మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం మరియు భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం సెక్షన్ ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు అంటున్నారు..

దీపావళి పండుగ సందర్భంగా మాజీ సీఎం కుమారస్వామి ఆయన జేపీ నగర్ నివాసానికి విద్యుత్ స్తంభం నుంచి కరెంటు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ (బెస్కామ్) అధికారులు మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి రూ. 68,000 జరిమానా విధించింది. బెస్కాం అధికారులు విధించిన అపరాధ రుసుంను ఇప్పటికే మాజీ సీఎం కుమారస్వామి చెల్లించారు.

FIR against KPCC leaders who put up posters in Bengaluru defaming HD Kumaraswamy

తనను కించపరిచి వేసిన పోస్టర్ల విషయంపై మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నీలి చిత్రాలను చూపించి గతంలో జీవనోపాధి పొందారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. నీలి చిత్రాలను చూపుతూ జీవనం సాగించిన అలాంటి వ్యక్తికి మరేం తెలుస్తుంది, ఎలాంటి బుద్ది వస్తుంది అని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు.

కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ కు పాతబుద్దిపోలేదని, అతను అలాంటి పోస్టర్లు మాత్రమే వేయగలరని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. తన మీద వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని ఇప్పటికే మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+