ఇసుక వ్యాపారం చేసిన ఇన్స్ పెక్టర్ సస్పెండ్
మైసూరు: అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని లారీని స్వాదీనం చేసుకుని అందులో ఉన్న ఇసుకను ప్రయివేటు వ్యక్తులకు అమ్మేసిన పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూరు నగరంలో జరిగిన ఈ విచిత్ర సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
బుధవారం మైసూరు నగర శివార్లలోని బిళికెరె పోలీసులు నాకాబంధి సాగించారు. ఆ సందర్బంలో అటు వైపు వెలుతున్న ఇసుక లారీని నిలిపారు. పర్మిట్ లేకుండ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని డ్రైవర్ యోగేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇసుక లారీని స్వాదీనం చేసుకుని డ్రైవర్ యోగేష్ మీద కేసు నమోదు చేసి అతనిని జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన యోగేష్ తన స్నేహితుల సహాయంతో తన లారీ మైసూరు నగరంలోని రామకృష్ణ నగరలో ఉందని తెలుసుకున్నాడు.

అక్కడికి వెళ్లి చూడగా ఖాళీ లారీ ఉందని, సమీపంలోని ఇంటి ముందు ఇసుక ఉందని యోగేష్ ఆరోపించాడు. బిళికెరె పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ పురుషోత్తం, కానిస్టేబుల్ భరత్ తన లారీ లోని రూ. 44,000 విలువైన ఇసుక విక్రయించారని ఆరోపించాడు.
మైసూరు నగరంలోని కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న మైసూరు జిల్లా ఎస్పీ అభినవ్ కార్ ఇన్స్ పెక్టర్ పురుషోత్తం, కానిస్టేబుల్ భరత్ ను సస్పెండ్ చేశారు. దర్యాప్తు చెయ్యాలని కువెంపు నగర పోలీసులకు ఎస్పీ అభినవ్ కార్ ఆదేశాలు జారీ చేశారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications