ఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం .. సి4 బోగీలో చెలరేగిన మంటలు , బోగీ దగ్ధం
ఢిల్లీ డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది . షార్ట్ సర్క్యూట్ కారణంగా సి 4 బోగీలో మంటలు చెలరేగడంతో భోగి పూర్తిగా దగ్ధమైంది . ఈ ఘటనలో బోగీ దగ్ధం కావటంతో ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది . ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు .
డెహ్రాడూన్- ఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్ యొక్క కోచ్లలో ఒకటి అయిన సి4 బోగీలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి . ప్రయాణ సమయంలో మంటలు చెలరేగడంతో ఈ బోగీని మిగిలిన రైలు నుండి వేరుచేయవలసి వచ్చింది. ఈ సంఘటన రైవాలా మరియు కాన్రావ్ స్టేషన్ల మధ్య జరిగింది. హరిద్వార్ లోని రాజాజీ పులుల సంక్షేమ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.
మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో, 02017 డెహ్రాడూన్- ఢిల్లీ శాతాబ్ది ఎక్స్ప్రెస్, సి -4 యొక్క ఎనిమిదో కోచ్ లో మంటలు చెలరేగాయి. బాధిత కోచ్ నుండి మొత్తం 35 మంది ప్రయాణికులను ఇతర బోగీలకు తరలించగా, బోగీ రైలు నుండి వేరుచేయబడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ డిజిపి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ-డెహ్రాడూన్ శాతాబ్ది ఎక్స్ప్రెస్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రోజు మంటలు చెలరేగాయని , ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించామని ఎవరికీ ఎలాంటి గాయాలు సంభవించలేదని వెల్లడించారు.