సునీత కృష్ణన్ షేమ్ రేపిస్ట్: ముఠాలోని ఒకతని పట్టివేత
న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడి, ఆ ఘటనలను వీడియో తీసి వాట్సప్లో పెట్టిన ముఠాలోని ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఒడిషాలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. భువనేశ్వర్కు చెందిన సుబ్రతా సాహును సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
మహిళలపై అత్యాచారం చేసి, వీడియో తీసి, దాన్ని వాట్సప్లో పెట్టిన నిందితులను పట్టుకోవాలంటూ షేమ్ ద రేపిస్టు పేర సునీత కృష్ణన్ గత నెలలో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితమే సిబిఐ సుబ్రతా సాహును పట్టుకున్నట్లు ఆమె తెలిపారు.
అరెస్టు చేసిన నిందితుడిని బుధవారం ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది. హైదరాబాదుకు చెందిన సునీతా కృష్ణన్ హైదరాబాదుకు చెందినవారు. అత్యాచారం నుంచి తప్పించుకున్న ఆమె ఎన్జీవోను నడుపుతున్నారు.
ఆ కేసును సుప్రీంకోర్టు ఫిబ్రవరి చివరివారంలో సూమోటాగా స్వీకరించి, దర్యాప్తు చేయాల్సిందిగా సిబిఐని ఆదేశించింది. అనుమానితులు పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని భావిస్తున్నారు.