మేఘాలయలో కాంగ్రెస్కు బిగ్ షాక్.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు పడిపోయిన హస్తం..
మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తమ పార్టీకి మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండిచ్చారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కాంగెస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలుపొందగా.. నేడు ఒక్కరు కూడా మిగలేదు.. అందరూ ప్రత్యర్థుల పార్టీలో చేరిపోయాయి.
గత ఏడాది నవంబర్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. తాజాగా ఆపార్టీలో మిగిలిన ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి ఉద్వాసన పలికారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న అధికార మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్లో చేరారు. ఈమేరకు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మాను కలిశారు. తామంతా కూటమిగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు లేఖను సీఎంకు సమర్పించారు. వీరి కూటమికి సీఎం కాన్రాడ్ కె. సంగ్మా సాదరస్వాగతం పలికారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ విధానాల పటిష్టతకు ఎండీఏ ప్రభుత్వంతో తామంతా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఐదుగురు ఎమ్మెల్యేలు వెల్లడించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం ద్వారా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుకెళ్లేందుకు దొహదం చేస్తుందని తెలిపారు.
MLAs decided to support this govt, I welcome them. Joining of Congress MLAs will not affect the relationship with our coalition partners. They've (MLAs) given a letter of support right now, they're also part of the Congress party: Meghalaya CM Conrad Sangma https://t.co/O6BcehRwde pic.twitter.com/1ERDFEUJ1P
— ANI (@ANI) February 8, 2022
ఈ మేరకు ఐదుగురు ఎమ్మెల్యే సంతకాలు చేసిన మెమొరాండంను సీఎంకు సమర్పించారు. త్రిపుర, నాగాలాండ్ లతో పాటు మేఘాలయలో 2023 ఫిబ్రవరిల ఎన్నికలు జరగాల్సింది ఉంది. 2018లో 21 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు జీరోకి పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో హస్తానికి వచ్చే ఎన్నికల్లో మరింత గడ్డు పరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Meghalaya | All five Congress MLAs of Meghalaya have decided to join Meghalaya Democratic Alliance (MDA) in the state. pic.twitter.com/JYwmayfGpO
— ANI (@ANI) February 8, 2022
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications