సెలవుపై వెళ్లిన లోకాయుక్త భాస్కర్ రావ్
బెంగళూరు: లోకాయుక్తలో అవినీతి జరిగిందని, రూ. కోటి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో ఇంత కాలం తలపట్టుకున్న లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ ఐదు రోజులు సెలవు (బుధవారం నుండి) పెట్టి వెళ్లిపోయారు.
సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించిన సమయంలోనే లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ సెలవు పెట్టడం చర్చకు దారితీసింది. లోకాయుక్తలో జరిగిన అవినీతిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకే భాస్కర్ రావ్ సెలవు మీద వెళ్లి ఉంటారని సమాచారం.

లోకాయుక్తలో లంచం డిమాండ్ చేశారని , భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ప్రమేయం ఉందని బహిరంగంగానే పేరు బయటకు వచ్చింది. ఇదే సమయంలో లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఏడీజీపీ కమల్ పంత్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి విచారణ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందంలో డీఐజీ సౌమేంద్ర ముఖర్జీ, బెంగళూరు తూర్పు, కేంద్ర విభాగం డీసీపీలు లాబూరామ్, సందీప్ పాటిల్ తో సహ 12 మంది అధికారులు ఉన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications