వామ్మో.. వరద ప్రవాహాం.. బైక్తో కొట్టుకుపోయిన వ్యక్తి (వీడియో)
వర్షాలతో వరద ప్రవాహాం కొనసాగుతోంది. ఇళ్లలోకి నీరు రావడమే కాదు.. రహదారులపై కూడా వచ్చి చేరింది. సో ఇలాంటి సమయంలో ప్రయాణిస్తోన్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బైక్ మీద జర్నీ చేసే సమయంలో ప్రాబ్లమ్ తప్పదు. కర్ణాటకలో ఓ వ్యక్తి అలానే వరద ప్రవాహాంలో కొట్టుకుపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
భారీ వర్షాల వల్ల ఆ రోడ్డు ఒక నదిలా తయారైంది. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొందరు ఆ రోడ్డు దాటుతున్నారు. మరికొందరు తమ బైకులపై రోడ్డు దాటాలని ప్రయత్నించారు. అలా చేస్తుండగా ఒక వ్యక్తి తన బండితో సహా కింద పడిపోయాడు. నీటి ప్రవాహ వేగాన్ని అడ్డుకోలేక బైక్తో సహా కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తూ కాసేపటికే రోడ్డుకు ఆవలివైపుకు చేరుకున్నాడు.

కర్ణాటకలోని తుమకూరు రోడ్డుపై ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతనే కాకుండా మరో బైకర్ కూడా ఇలాగే కింద పడిపోగా.. చుట్టుపక్కల వారు అతన్ని కాపాడారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల భారీగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వర్షంతో జన జీవనం స్తంభించిన సంగతి తెలిసిందే.
#WATCH | Karnataka: A biker had a narrow escape after he swept away while crossing a flooded road in Tumakuru pic.twitter.com/qbNqefsBnD
— ANI (@ANI) November 20, 2021
#WATCH | Karnataka: A biker had a narrow escape after he swept away while crossing a flooded road in Tumakuru pic.twitter.com/qbNqefsBnD
— ANI (@ANI) November 20, 2021
Recommended Video
ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తిరుమల కొండచరియలు విరిగి ఘాట్ రోడ్డుపై పడిపోయాయి. మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది. తిరుమల జలదిగ్బందంలో చిక్కుకొనిపోయింది. ఇలా పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ జోరు వానలు జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరో రెండు, మూడు రోజులు కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications