Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీక్రెట్ కాదు, ఓపెన్ బ్యాలెట్టే: తేల్చేసిన సుప్రీం, బీజేపీ వాదనపై నవ్వేసిన ధర్మాసనం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప ప్రభుత్వంపై బలనిరూపణ విషయంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పులను వెల్లడించింది. శనివారం సాయంత్రం 4గంటల లోగా యడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొవాల్సిందేనని ఆదేశించింది.

బీజేపీ తరపు న్యాయవాది రోహిత్గి సమయం కావాలని కోరినప్పటికీ సుప్రీం అందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వెళ్లారని.. వారు వచ్చేందుకు సమయం పడుతుందని, అందుకే మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు రోహిత్గి.

Floor test not by secret ballot, it will be a open vote- SC declared

అయితే, దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం నవ్వేసింది. అయినా, బలనిరూపణకు సమయం పెంచబోమని స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం 4గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష జరగాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఆ తర్వాత న్యాయవాది ముకుల్ రోహిత్గి కోర్టుకు మరో విన్నపం తెలియజేశారు. బలనిరూపణ పరీక్షను సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరారు. ఇందుకు కూడా కోర్టు అంగీకరించలేదు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిర్వహించకూడదని, ఓపెన్ ఓట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీజేపీ శనివారం బలపరీక్షకు సిద్ధమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+