సీక్రెట్ కాదు, ఓపెన్ బ్యాలెట్టే: తేల్చేసిన సుప్రీం, బీజేపీ వాదనపై నవ్వేసిన ధర్మాసనం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప ప్రభుత్వంపై బలనిరూపణ విషయంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పులను వెల్లడించింది. శనివారం సాయంత్రం 4గంటల లోగా యడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొవాల్సిందేనని ఆదేశించింది.
బీజేపీ తరపు న్యాయవాది రోహిత్గి సమయం కావాలని కోరినప్పటికీ సుప్రీం అందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వెళ్లారని.. వారు వచ్చేందుకు సమయం పడుతుందని, అందుకే మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు రోహిత్గి.

అయితే, దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం నవ్వేసింది. అయినా, బలనిరూపణకు సమయం పెంచబోమని స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం 4గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష జరగాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఆ తర్వాత న్యాయవాది ముకుల్ రోహిత్గి కోర్టుకు మరో విన్నపం తెలియజేశారు. బలనిరూపణ పరీక్షను సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరారు. ఇందుకు కూడా కోర్టు అంగీకరించలేదు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిర్వహించకూడదని, ఓపెన్ ఓట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీజేపీ శనివారం బలపరీక్షకు సిద్ధమవుతోంది.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో











Click it and Unblock the Notifications