పుట్ ఓవర్ బ్రిడ్జికూలి నదిలో పడిన 50 మంది, 12 మందిని రక్షించిన సిబ్బంది
దక్షిణ గోవాలో పుట్ ఒవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో 50 మంది నదిలో పడి గల్లంతయ్యారు.అయితే ఈ ఘటనలో 12 మందిని సురక్షితంగా రక్షించారు సహయకసిబ్బంది. నదిలో గల్లంతైన వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
పనాజీ: దక్షిణ గోవాలో పుట్ ఒవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో 50 మంది నదిలో పడి గల్లంతయ్యారు.అయితే ఈ ఘటనలో 12 మందిని సురక్షితంగా రక్షించారు సహయకసిబ్బంది. నదిలో గల్లంతైన వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
వంతెనపైన పుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది.అయితే పుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ బ్రిడ్జి పై ఉన్నవారంతా కిందనే ఉన్నవారు నదిలో పడిపోయారు. నదిలో పడిన 50 మందిలో సుమారు 12 మందిని రక్షించారు రెస్క్యూటీమ్.దక్షిణ గోవాలోని కర్ చోరం ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. స్థానిక నదిపై పోర్చుగీస్ కాలంలో నిర్మించిన జువారి పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ బ్రిడ్జికుప్పకూలుతున్న సమయంలో బ్రిడ్జిపై నడుస్తున్న 50 మంది నదిలో పడి గల్లంతయ్యారు.అయితే ఈ సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకొని నదిలో పడిపోయినవారిని రక్షించేందుకు సహాయక చర్యలను చేపట్టారు. అయితే ఇప్పటికే 12 మందిని రక్షించారు.అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఓ బాలుడు బ్రిడ్జిపై నుండి నదిలోకి దూకాడు. ఇది తెలుసుకొన్న పోలీసులు వంతెనవద్దకు చేరుకొని బాలుడిని రక్షించారు. ఈ క్రమంలోనే పాదచారులు వెళ్ళే ప్రదేశం జనాలు గుమికూడారు. బాలుడిని రక్షించిన తర్వాత కొందరు వెళ్ళిపోగా మరికొందరు అక్కడే ఉన్నారు. దీంతో వంతెన కుప్పకూలిపోయింది. దరిమిలా 50 మందికిపైగా పాదచారులు నదిలో పడి గల్లంతయ్యారు.