వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రెక్కింగ్ యువతుల బట్టలూడదీసి!: బెంగుళూరు కీచకపర్వం మరవకముందే..

ఓవైపు బెంగుళూరు కీచకపర్వం ఇంకా వార్తల్లో నానుతుండగానే.. మహిళలపై జరిగిన మరో దారుణం వెలుగుచూసింది.

|
Google Oneindia TeluguNews

పూణే: దేశంలో మహిళలకు భద్రత కరువైందా?.. మొన్న బెంగుళూరు కీచక పర్వం. నేడు మరాఠా గడ్డ మీద మహిళలకు మరో ఘోర అవమానం. ప్రాంతమేదైనా మహిళలకు మాత్రం మృగాళ్ల నుంచి వేధింపులు తప్పట్లేదు.

ఓవైపు బెంగుళూరు కీచకపర్వం ఇంకా వార్తల్లో నానుతుండగానే.. మహిళలపై జరిగిన మరో దారుణం వెలుగుచూసింది. మోరల్ పోలిసింగ్ పేరిట బట్టలూడదీసి మరీ వారిని అవమానించారు. పూణేకు 50కి.మీ దూరంలోని లోనావాలా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ట్రెక్కింగ్ కోసం 12మంది యువతీ-యువకుల బృందం ఇసాపూర్ కోటకు వెళ్లారు. అక్కడి కోటపై వారు ట్రెక్కింగ్ కు సిద్దమవుతున్న సమయంలో శివాజీ భక్తులమని చెప్పుకుంటూ కొంతమంది యువకులు అక్కడికి వచ్చారు. తాము 'ఫోర్డ్ లవర్స్' గ్రూప్ కి చెందినవారమని చెప్పుకున్నారు.

Ford Lovers group harassed trekking women

వస్తూ.. వస్తూనే.. యువతులపై మాటల యుద్దానికి దిగారు. అబ్బాయిలతో తిరిగి భారత సంస్కృతిని పాడుచేస్తున్నారని ట్రెక్కింగ్ కోసం వచ్చిన యువతులను విమర్శించారు. అమ్మాయిల వెంట ఉన్న అబ్బాయిలను కూడా తరిమికొట్టారు. వారసత్వ సంపద అయిన కోటను నాశనం చేస్తున్నారని దూషించారు.

మోరల్ పోలిసింగ్ పేరిట బట్టలూడదీసి మరీ వారిని కొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అకృత్యాలన్ని ఫోటోలు, వీడియోల రూపంలో మీడియాకు దొరకడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. అయితే ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం దీనిపై స్పందించకపోవడం విచారకరం.

English summary
A batch of Ford Lovers group was harassed trekking women in maharashtra. The videos are leaked out to media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X