పర్యావరణం కోసం ఉపగ్రహ చిత్రాలు: జవదేకర్(ఫోటోలు)
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదని, అలా అని అనుమతుల పేరుతో అభివృద్ధిని ఆపబోమని కేంద్ర, అటవీ, పర్యావరణ శాఖ(స్వతంత్ర) మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. అనుమతులకు సంబంధించి న నిబంధనలను సరళీకరించడంతో పాటు కాలుష్యకారక పరిశ్రమలను నియంత్రించేందుకు కఠిన నిబంధనలను రూపొందిస్తుమన్నారు.
ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి అన్ని ఫిర్యాదులను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా విశ్లేషించనున్నామన్నారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే గతంలో కంటే ఎంతో అభివృద్ధి చూపించామన్నారు.
అనుమతుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్ధితిని తగ్గించామని.. కాలుష్యాన్ని అరికట్టడం వంటి అంశాల్లోనూ స్పష్టమైన తేడా గమనించవచ్చన్నారు. అడవుల నరికివేతకు సంబంధించి అందే ఫిర్యాదుల అధ్యయనం చేస్తామని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంత మేరకు నష్టం జరిగిందన్నది నేరుగా తెలుసుకోవడం ద్వారా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

పర్యావరణం కోసం ఉపగ్రహ చిత్రాలు: మంత్రి జవదేకర్
పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదని, అలా అని అనుమతుల పేరుతో అభివృద్ధిని ఆపబోమని కేంద్ర, అటవీ, పర్యావరణ శాఖ(స్వతంత్ర) మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.
పర్యావరణం కోసం ఉపగ్రహ చిత్రాలు: మంత్రి జవదేకర్
ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి అన్ని ఫిర్యాదులను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా విశ్లేషించనున్నామన్నారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే గతంలో కంటే ఎంతో అభివృద్ధి చూపించామన్నారు.

పర్యావరణం కోసం ఉపగ్రహ చిత్రాలు: మంత్రి జవదేకర్
అనుమతుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్ధితిని తగ్గించామని.. కాలుష్యాన్ని అరికట్టడం వంటి అంశాల్లోనూ స్పష్టమైన తేడా గమనించవచ్చన్నారు. అడవుల నరికివేతకు సంబంధించి అందే ఫిర్యాదుల అధ్యయనం చేస్తామని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంత మేరకు నష్టం జరిగిందన్నది నేరుగా తెలుసుకోవడం ద్వారా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

పర్యావరణం కోసం ఉపగ్రహ చిత్రాలు: మంత్రి జవదేకర్
గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రత్యామ్నయ వనీకరణ నిధి (కంపా)కి సంబంధించి రూ. 35 వేల కోట్లు పేరుకోనిపోయాయి. వీటిని ఇప్పుడు సద్వినియోగం చేస్తున్నాం. పర్యావరణ అనుమతులు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం కూడా ఆగిపోయింది.

పర్యావరణం కోసం ఉపగ్రహ చిత్రాలు: మంత్రి జవదేకర్
అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు ఇస్తున్నామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఇక కొమరం భీం ప్రాజెక్టుకు వెంటనే అటవీ శాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేయాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను జవదేకర్ కోరారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.వీటికి సంబంధించి చట్టాలను సవరిస్తామని, రెండు మూడు నెలల్లో ఇవి అమల్లోకి వస్తాయన్నారు. "గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రత్యామ్నయ వనీకరణ నిధి (కంపా)కి సంబంధించి రూ. 35 వేల కోట్లు పేరుకోనిపోయాయి. వీటిని ఇప్పుడు సద్వినియోగం చేస్తున్నాం. పర్యావరణ అనుమతులు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం కూడా ఆగిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆరువేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి అనుమతిచ్చాం. రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్తు సరఫరా లైన్ల నిర్మాణాల విషయంలో అనుమతులను సరళీకరిస్తున్నామని" జవదేకర్ తెలిపారు.
అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు ఇస్తున్నామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఇక కొమరం భీం ప్రాజెక్టుకు వెంటనే అటవీ శాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేయాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను జవదేకర్ కోరారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications