బళ్లారి బాబు స్కెచ్ అదిరింది, సీఎం జగన్ అండగా సీన్ రివర్స్, మాజీ ఎంపీకి హామీల పండగ !
కర్ణాటక మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు సోదరి, మాజీ ఎంపీ జే. శాంత కర్ణాటక రాజకీయాలకు వీడ్కోలు పలికారా? అని బళ్లారి జిల్లా హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ మాజీ ఎంపీ శాంత కర్ణాటక రాజకీయాలను వదిలి పక్కనే ఉన్న ఆంధ్రా రాజకీయాల్లోకి రావడమే ఇప్పుడు తీవ్రచర్చకు దారితీసింది. కర్ణాటక రాజకీయాలను శాంత ఎందుకు వదిలేశారు అనే ప్రశ్న ఇప్పుడు బళ్లారి ప్రజల ముందు చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని తాడిపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలోకి మంగళవారం వెళ్లిన బీజేపీ మాజీ ఎంపీ శాంత జగమ్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ శాంత హిందుపురం లోక్ సభ నియోజక వర్గం నుంచి వైఎస్ఆర్పీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని శాంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీ జే శాంతా అనంతపురం జిల్లా హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. హిందూపురం లోక్ సభ నియోజక నియోజకవర్గంలో నాలుగున్నర లక్షల మంది వాల్మీకి కులానికి చెందిన ( సామాజికవర్గం) ఓటర్లు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకి కులం షెడ్యూల్డ్ కులానికి చెందినది.
ఆంధ్రప్రదేశ్ లో కూడా అనంతపురం, కర్నూరు జిల్లాలో వాల్మికి కలం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. బళ్లారి బీజేపీ మాజీ ఎంపీ శాంతా ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ పట్టణంలో నివాసం ఉండేవారు. 2009లో శ్రీరాములు సహకారంతో బళ్లారి నుంచి బీజేపీ ఎంపీ టిక్కెట్ దక్కించుకున్న శాంతా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్రెడ్డి, శ్రీరాములు మధ్య రాజకీయ సంబంధాలు తెగిపోయిన కథ పూర్తిగా మారిపోయింది.
2018లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి శాంతా ఓడిపోయారు. ఇప్పుడు బళ్లారి లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్టు ఇచ్చే అవకాశం చాలా తగ్గడంతో వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆంధ్రాలోని హిందూపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ శాంతా ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంత బలంగా లేదు. అందుకే రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి శాంతా ప్రయత్నిస్తున్నారు.

బీజేపీ మాజీ ఎంపీ శాంతా వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2009లో శ్రీరాములు సహకారంతో బళ్లారి నుంచి లోక్సభకు ఎన్నికైన శాంతా అప్పట్లో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ తో ఢిల్లీలోనే పరిచయాలు పెరిగాయి. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీకి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనసరం లేదు.
గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు అయిన బళ్లారి శ్రీరాములు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ముందు నుంచి పరిచయమే. అలా మాజీ ఎంపీ శాంతా ఇప్పుడు వైఎస్ఆర్ సీపీలో చేరడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండాపోయాయని తెలిసింది. ఈ విదంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి శాంతా ప్రవేశానికి ఎలాంటి అడ్డంకులులేకుండాపోయాయనే సంగతి తెలిసిందే. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శాంతా బీజేపీ టికెట్ ఆశించారు.

అయితే శాంతాకు బీజేపీ టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించింది. ఎమ్మెల్యే టిక్కెట్ రానప్పుడు ఎంపీ టిక్కెట్ ఎలా వస్తుందని అని అన్ని ఆలోచించించిన మాజీ ఎంపీ శాంతా ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లోకి వెళ్లడానికి సిద్దం అయ్యారు. బళ్లారి ఎంపీ టిక్కెట్ దక్కడం కష్టమని అని తెలుసుకున్న శాంతా ఏకంగా రాజకీయాల కోసం రాష్ట్రాన్ని మార్చేశారని ఇప్పుడు బళ్లారిలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఎందుకుకంటే రాజకీయాలు అలాంటివి అని కొందరు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. గతంలో బళ్లారి ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను ఆంధ్రా మహిళను కాదు, నేను బళ్లారి కూతురిని అని శాంతా చెప్పారు. ఆ సమయంలో శాంతా నాన్ లోకల్ అని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పుడు ఆంధ్రాలో పోటీ చెయ్యడనికి సిద్దం అయిన శాంతా తాను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళను కాదని, నేను ఆంధ్రా కోడలు అని హిందుపురంలో చెబుతారో లేదో అనే వియం వేచిచూడాలి.












Click it and Unblock the Notifications