ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య..కోలుకోవాలని మమత ఆకాంక్ష..
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దాదేవ్ భట్టాచార్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. భట్టాచార్య అనారోగ్యంపై గవర్నర్, సీఎం స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇరువురు ఆకాంక్షించారు.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో బుద్దదేవ్ భట్టాచార్య ఆస్పత్రిలో చేరారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అతను త్వరగా కోలుకోవాలని ఆమె కోరారు. గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా భట్టాచార్య త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. భట్టాచార్యకు ప్రైవేట్ ఆస్పత్రి ప్లూ క్లినిక్లో వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నారు.

భట్టాచార్యకు అవసరమైన పరీక్షలు చేస్తున్నామని ప్లు క్లినిక్ వైద్యులు తెలిపారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమబెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు. శ్వాసకోస ఇబ్బందులతోపాటు.. ఇతర సమస్యలు భట్టాచార్యకు ఉన్నాయి. వృద్దాప్యంలోకి రావడంతో సహజంగానే ఇతర సమస్యలు కూడా వస్తాయి. క్రమంగా సీపీఎం పార్టీ క్రియాశీల పదవులకు భట్టాచార్య దూరంగా ఉంటూ వస్తున్నారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు, సీపీఎం పొలిట్ బ్యూరో నుంచి 2018లో వైదొలిగారు. ఇక అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications