ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య..కోలుకోవాలని మమత ఆకాంక్ష..
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దాదేవ్ భట్టాచార్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. భట్టాచార్య అనారోగ్యంపై గవర్నర్, సీఎం స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇరువురు ఆకాంక్షించారు.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో బుద్దదేవ్ భట్టాచార్య ఆస్పత్రిలో చేరారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అతను త్వరగా కోలుకోవాలని ఆమె కోరారు. గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా భట్టాచార్య త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. భట్టాచార్యకు ప్రైవేట్ ఆస్పత్రి ప్లూ క్లినిక్లో వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నారు.

భట్టాచార్యకు అవసరమైన పరీక్షలు చేస్తున్నామని ప్లు క్లినిక్ వైద్యులు తెలిపారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమబెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు. శ్వాసకోస ఇబ్బందులతోపాటు.. ఇతర సమస్యలు భట్టాచార్యకు ఉన్నాయి. వృద్దాప్యంలోకి రావడంతో సహజంగానే ఇతర సమస్యలు కూడా వస్తాయి. క్రమంగా సీపీఎం పార్టీ క్రియాశీల పదవులకు భట్టాచార్య దూరంగా ఉంటూ వస్తున్నారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు, సీపీఎం పొలిట్ బ్యూరో నుంచి 2018లో వైదొలిగారు. ఇక అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications