కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారం
న్యూఢిల్లీ: దివంగత బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించారు. శతజయంతి వేళ ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం గమనార్హం. జననేత, జననాయక్ గా ప్రసిద్దిగాంచిన కర్పూరి ఠాకూర్.. రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.

1924, జనవరి 24న బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఆయన జన్మించారు. 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు.1970వ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు కోటా(రిజర్వేషన్)ల అమలులో కీలక పాత్ర పోషించారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ వంటి ప్రస్తుత నాయకుల రాజకీయ వ్యూహాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
కాగా, కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతల స్పందించారు.'సామాజిక న్యాయం మార్గదర్శి, జననాయక్ కర్పూరి ఠాకూర్ శత జయంతి వేళ ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించడం నాకు చాలా ఆనందంగా ఉంది' అని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు.
కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మంగళవారం, జేడీ(యూ) నాయకుడు కేశి త్యాగి ఠాకూర్కు భారతరత్న కోసం వాదించడమే కాకుండా, ఆయన పేరు మీద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
"కర్పూరీ ఠాకూర్ ఒక దృఢమైన నాయకుడు, ఆయన బీహార్, దేశానికి చేసిన కృషి ఎనలేనిది. మేము అతని వారసత్వాన్ని భారతరత్నతో గౌరవించడం, ఆయన ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం సముచితం' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఠాకూర్ జయంతిని జరుపుకునే తమ ప్రణాళికలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూ బలహీనపరిచిందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించడంతో ఈ ప్రకటన రాజకీయ దృశ్యంపై మళ్లీ చర్చకు దారితీసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి జనవరి 24న జేడీయూ కార్యాలయం వెలుపల ప్రదర్శన చేస్తానని బెదిరిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications