Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముందు మీ పార్టీని రక్షించుకోండి, తరువాత మాట్లాడదాం అంటున్న మాజీ సీఎం !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలో బీజేపీ మునిగిపోతున్న ఓడ అని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగదీష్ శెట్టర్ విమర్శించారు. అదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విరుచుకుపడ్డారు. కర్ణాటకలో బీజేపీని రక్షించుకోవాలని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీ నాయకుడు బీఎల్. సంతోష్ కు సూచించారు.

బెంగళూరులో నగరంలోని మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీఎల్ సంతోష్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దాదాపు 45 మంది కాంగ్రెస్‌ నేతలు తనతో టచ్‌లో ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి బీఎల్. సంతోష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీపై బీజేపీ అధికార ప్రతినిధి ఎంజీ మహేశ్‌ విలేకరులతో మాట్లాడుతూ యాపార్టీని ఎవరూ వీడరని అన్నారు.

Former CM Jagdish Shetter advised BL Santosh to save BJP in Karnataka.
40 నుంచి 45 మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్‌లో ఉన్నారని బీఎల్ సంతోష్ చెప్పారు. దీనిపై స్పందించిన జగదీష్ శెట్టర్ సంతోష్ బీఎల్ సంతోష్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ మునిగిపోయే నావలాగా ఉన్నందున ఉన్న ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవాల జగదేశమ ని సంతోష్‌కు సూచించారు. వీలైతే జంపింగ్ ఎమ్మెల్యేలను మళ్లీ బరిలోకి దించాలని బీఎల్ సంతోష్ కు సవాల్ విసిరారు.

ముందుగా మీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో కొనసాగించాలని సలహా ఇస్తున్నాను. రాష్ట్రంలో బీజేపీ ఉనికి కోసం పోరాడుతోంది. ప్రభుత్వానికి ఈ స్థాయిలో మెజారిటీ వస్తే కాంగ్రెస్‌ను వీడేదెవరు? కావాలంటే ఆపరేషన్ చేయనివ్వండి, రేపు ఎమ్మెల్యేని తీసుకెళ్లమనండి మేమూ చూస్తామని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ సవాలు విసిరారు.

Former CM Jagdish Shetter advised BL Santosh to save BJP in Karnataka.
కర్ణాటక బీజేపీ తన ఉనికిని కోల్పోతోందని నాకు చాలాసార్లు అనిపించింది, దీనికి ప్రధాన కారణం పార్టీ కొందరి నియంత్రణలో ఉండటమే. పార్టీ నుంచి విముక్తి పొందేంతవరకు ఆ పార్టీ రోజురోజుకూ క్షీణిస్తూనే ఉంటుందని జగదీష్ శెట్టర్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ షెట్టర్‌కు బీజేపీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. తరువాత బీజేపీ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగదీష్ శెట్టర్ హుబ్బళి ధారవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. బీఎల్ సంతోష్, ప్రహ్లాద్ జోషిల కారణంగానే తనకు టిక్కెట్ రాలేదని అప్పట్లో జగదీష్ శెట్టర్ ఆరోపించారు. జగదీష్ శెట్టర్ శిష్యుడు, మాజీ మంత్రి శంకర్ పాటిల్ మునేనకొప్ప కాంగ్రెస్‌లో చేరనున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై మాట్లాడిన జగదీష్ శెట్టర్ బీజేపీ నేతలెవరూ తనను సంప్రదించలేదని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+