Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ స్కెచ్, రంగంలోకి దిగిన మాజీ సీఎం, సిట్టింగ్ సీఎంకు సినిమా చూపించాలని ప్లాన్, అదే జరిగితే ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ ఘోరంగా ఓడిపోయిన పాత మైసూర్‌ ప్రాంతం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు సైలెంట్‌గా సన్నాహాలు జరుగుతున్నాయి. పాత మైసూర్‌లో దళపతుల పార్టీ జేడీఎస్ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పుంజుకోవాలని జేడీఎస్ నాయకులు ప్లాన్ చేస్తున్నారు.

పాత మైసూర్ తో సహా ఇతర ప్రాంతాల్లో జేడీఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరేందుకు మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని తెలిసింది. అందుకు తగ్గట్టుగానే మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామిని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీలో దింపితే ఎలా ఉంటుంది అని చర్చలు జరుగుతున్నాయి.

Former Karnataka CM Kumaraswamy is preparing to contest the Lok Sabha elections ?
మాజీ సీఎం కుమారస్వామి మండ్య నుంచి పోటీలో దిగితో పాత మైసూరులో దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని జేడీఎస్ లో చర్చ జరిగిందని వెలుగు చూసింది. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న హెచ్ డీ కుమారస్వామిని మండ్య నుంచి బరిలోకి దింపడం ద్వారా పాత మైసూరు ప్రాంతంలోచ బీజేపీ-జేడీఎస్ కూటమి ఇంకా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవచ్చని జేడీఎస్ నేతలు లెక్కలు వేసుకున్నట్లు సమాచారం.

మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పోటీకి అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలి అని జేడీఎస్ లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ గెలిచే నియోజకవర్గాలపై కూడా కుమారస్వామి జేడీఎస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా చిక్కమగళూరు జిల్లాలోని మల్లెనహళ్లిలోని హనీ డ్యూ రిసార్ట్‌లో పాత మైసూరు ప్రాంతం జేడీఎస్ నేతలతో సీరియస్‌గా చర్చించినట్లు సమాచారం. మండ్య మాజీ ఎంపీ పుట్టరాజుతోపాటు పలువురు నేతలు ఇదే రిసార్ట్‌లో కుమారస్వామితో చర్చలు జరిపారని తెలిసింది.

బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే సా.రా.మహేష్, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) ఎస్.ఎల్. భోజెగౌడ్, బాలకృష్ణతో మాజీ సీఎం కుమారస్వామి చర్చించినట్లు తెలిసింది. మాజీ సీఎం కుమారస్వామి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఇప్పటికే చాలా ఒత్తిడి జరిగింది. ఎమ్మెల్సీ ఎస్ఎల్ భోజెగౌడ కూడా బీజేపీ గెలిచే నియోజకవర్గాలలో కుమారస్వామి పోటీ చేస్తారని సంకేతాలు ఇచ్చారు. మండ్య, తుమకూరు, చిక్కబళ్లాపూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట కుమారస్వామి పోటీకి దింపాలని జేడీఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Former Karnataka CM Kumaraswamy is preparing to contest the Lok Sabha elections ?

వచ్చే లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుమారస్వామి బీజేపీ- జేడీఎస్ కూటమి నుంచి నాలుగు నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీపై కుమారస్వామి పలువురు బీజేపీ నేతలు, మండ్య ఎంపీ సుమలతా అంబరీష్ కు అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. అలాగే బెంగళూరు రూరల్, మండ్య, చిక్కబళ్లాపురం నియోజకవర్గాల్లో పోటీపై సర్వే చేయనున్నట్టు చెబుతున్నారు.

మండ్య నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే దృక్పథంతో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పోటీ చేస్తే బీజేపీ- జేడీఎస్ కూటమి అభ్యర్థులకు మరింత బలం చేకూరుతుందని బీజేపీ నేతలు చర్చించుకున్నారని తెలిసింది. బీజేపీ హైకమాండ్ కూడా లోక్ సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొత్తం మీద కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో చుక్కలు చూపించాలని బీజేపీ, జేడీఎస్ నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+