అశ్లీల ఫోటోలు బహిర్గతం చేస్తానన్న మాజీ మంత్రి, కేసు
ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మాజీ మంత్రి లక్ష్మణ్రావు దోబ్లేపై అత్యాచారం కేసు నమోదైంది. శనివారమిక్కడ ఓ మహిళ బోరివళ పోలీస్ స్టేషన్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అశ్లీల ఫోటోలు బహిర్గతం చేస్తానంటూ బెదిరించి లక్ష్మణ్రావు దోబ్లే 2011-13 మధ్యకాలంలో మూడుసార్లు అత్యాచారం జరిపినట్లు బాధితురాలు పేర్కొందని పోలీసులు తెలిపారు.
ముంబైలోని లక్ష్మణ్రావు దోబ్లేకు చెందిన కళాశాలలో బాధితురాలు ఉద్యోగం చేస్తోంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నలంద కాలేజీలో పనిచేస్తున్న ఈమె వయసు 42 సంవత్సరాలు. ఆమె ఫిర్యాదు మేరకు లక్ష్మణ్రావు దోబ్లే వ్యతిరేకంగా 376, 323, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
లక్ష్మణ్రావు దోబ్లే మాత్రం తనపై వచ్చిన అత్యాచార ఆరోపణల్ని ఖండించారు. ఫిర్యాదు చేసిన మహిళ తన కళాశాలలో రూ. 80 లక్షలు అవినీతికి పాల్పడిందన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తనపై అత్యాచారం ఆరోపణలు చేస్తోందన్నారు.