నింగికెగిసిన మన్మోహనుడు: అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. దేశ రాజధానిలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలంతో ఈ కార్యక్రమం కొనసాగింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేశారాయన. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆ శాఖ మంత్రిగా పని చేశారాయన. ఆర్థిక వ్యవస్థకు జీవం పోశారు.

ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అంతిమయాత్ర ఆరంభమైంది. మిలటరీ వాహనంపై నిగమ్ బోధ్ ఘాట్కు పార్థివదేహాన్ని అధికార, సైనిక లాంఛనాలతో తీసుకొచ్చారు. ఆ సమయంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనం నిల్చున్నారు. పూలు చల్లుతూ కన్నీటి వీడ్కోలు పలికారు.
నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి, కొందరు మంత్రులు నివాళి అర్పించారు.
ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. చివరిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధాతప్త హృదయంతో నివాళి అర్పించారు. సెల్యూట్ చేశారు. ఆ సమయంలో అందరూ లేచి నిల్చుని మౌనం పాటించారు.
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి మనీష్ గోబిన్.. ఆయనకు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సహా పలువురు మంత్రులు, అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరైన వారిలో ఉన్నారు.
#WATCH | Former Prime Minister #DrManmohanSingh laid to rest with full state honours after leaders and family paid last respects at Nigam Bodh Ghat in Delhi.
— ANI (@ANI) December 28, 2024
Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi.
(Source: DD News) pic.twitter.com/MvAJsZefrt
ద్రౌపది ముర్ము నివాళి అర్పించిన అనంతరం మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని చితిపైకి తీసుకొచ్చారు. సిక్కుల సంప్రదాయంలో అంత్యక్రియలను చేపట్టారు. ఆ సమయంలో సిక్ పెద్దలు సంప్రదాయబద్ధమైన కృపాణులను ధరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ప్రార్థనలను నిర్వహించారు.
#WATCH | Former Prime Minister #DrManmohanSingh laid to rest with full state honours after leaders and family paid last respects at Nigam Bodh Ghat in Delhi.
— ANI (@ANI) December 28, 2024
(Source: DD News) pic.twitter.com/Kk9RMgOMz1
అనంతరం ఆర్మీ జవాన్లు మన్మోహన్ సింగ్ గౌరవార్థం గాలిలోకి కాల్పులు జరిపారు. తరువాత ఆయన పార్థివదేహాన్ని ఉంచిన చితికి నిప్పంటించారు. ఆ సమయంలో నిగమ్ బోధ్ ఘాట్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ సహా అక్కడున్న వాళ్లందరూ విషాదఛాయలతో కనిపించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు పెట్టారు. చితి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications