వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్ -ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు -వ్యాక్సిన్ తీసుకున్నా ఇన్ఫెక్షన్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతోందనడానికి నిదర్శనంగా టాప్మోస్ట్ రాజకీయ నేతలు సైతం ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ వ్యాధితో ఐసోలేషన్ కు పరిమితం కాగా, భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ వెటరన్ మన్మోహన్ సింగ్ (88) అనూహ్య రీతిలో కరోనా వైరస్ బారినపడ్డారు.

షాక్: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ -ఫామ్‌హౌజ్‌లో ఐసోలేషన్ -సాగర్ సభ కొంపముంచిందా?షాక్: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ -ఫామ్‌హౌజ్‌లో ఐసోలేషన్ -సాగర్ సభ కొంపముంచిందా?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ అని సోమవారం నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. నిజానికి మన్మోహన్ సింగ్ దంపతులు మార్చి 4న ఇదే ఎయిమ్స్ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. రెండో డోసు తీసుకోవాల్సి ఉండగా, అంతలోనే సింగ్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.

 Former PM Manmohan Singh admitted to AIIMS Delhi after testing positive for Covid-19

కొవిడ్ వ్యాధితో మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితిని ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా, మన్మోహన్ ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుని ఉన్నందున వ్యాధి నుంచి తొందరగానే ఉపశమనం పొందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. అందులో..

కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

Recommended Video

COVID-19 Predominantly Spreads Through Air - Lancet Study || Oneindia Telugu

రానున్న ఆర్నెల్ల టార్గెట్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు ఆర్డర్లు ఇవ్వాలని, వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను నిర్ణయించుకునే అధికారమూ రాష్ట్రాలకే వదిలేయాలని, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో కంపెనీలకు 'లైసెన్సింగ్‌ తప్పనిసరి' నిబంధనను కొంతకాలం తొలగించాలని, టీకా తయారీ దారులకు ప్రోత్సాహకాలు అందించాలని, యూరప్, అమెరికా ఎఫ్‌డీఏ వంటి సంస్థలు ఆమోదించిన టీకాలను దిగుమతి చేసుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన లేఖలో మోదీకి సూచించడం తెలిసిందే.

English summary
Former prime minister and veteran Congress leader Manmohan Singh has been admitted to the All India Institute of Medical Sciences (AIIMS) Delhi after testing positive for coronavirus on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X