Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

G20 Summit : మోడీపై మన్మోహన్ ప్రశంసల జల్లు-ఉక్రెయిన్ యుద్ధంపై సరైన వైఖరి అంటూ..

భారత్ వేదికగా అంతర్జాతీయ జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ప్రధాని మోడీ నాయకత్వ పటిమపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూనే, శాంతి కోసం కూడా ప్రయత్నిస్తోందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని అభినందిస్తూ భారత్ సరైన పని చేసిందని అన్నారు.

2004 నుండి 2014 వరకు తాను ప్రధానమంత్రిగా ఉన్న పదవీకాలంతో పోలిస్తే దేశీయ రాజకీయాల్లో విదేశాంగ విధానం యొక్క ప్రాముఖ్యతను మన్మోహన్ సింగ్ గుర్తుచేసుకున్నారు. జీ20 సదస్సుకు ఆహ్వానం అందుకున్న మన్మోహన్ సింగ్.. పార్టీ రాజకీయాల్ని పక్కనబెట్టి దౌత్య వ్యవహారాల ప్రాధాన్యతను వెల్లడించారు. జాతీయ మీడియా నెట్ వర్క్ ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడుతూ మన్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

former pm manmohan singh lauds pm modis leadership amid G20 summit

తన జీవితకాలంలో జీ20 అధ్యక్ష పదవికి భారతదేశానికి అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నానన్నారు. అలాగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి తాను సాక్షిగా ఉన్నట్లు వెల్లడించారు. భారతదేశం యొక్క పాలనా ఫ్రేమ్‌వర్క్‌లో ఈ విధానం ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన అంశంగా ఉందని తెలిపారు. అయితే ఇది గతంతో పోలిస్తే ఇవాళ దేశీయ రాజకీయాలకు మరింత సందర్భోచితంగా, ముఖ్యమైనదిగా మారిందని మన్మోహన్ చెప్పారు.

ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం దేశీయ రాజకీయాల్లో ఒక సమస్యగా ఉండాలి. అయితే ఇది పార్టీ లేదా వ్యక్తిగత రాజకీయాల కోసం దౌత్యం, విదేశాంగ విధానాన్ని ఉపయోగించడంలో సంయమనం పాటించడం కూడా అంతే ముఖ్యమని మన్మోహన్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ సమస్యపై భారతదేశం "సరైన పని" చేసిందని పేర్కొన్న మన్మోహన్.. రెండు లేదా అంతకంటే ఎక్కువ శక్తులు వివాదంలో చిక్కుకున్నప్పుడు, ఇతర దేశాలపై విపరీతమైన ఒత్తిడి ఉంటుందన్నారు.

ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారతదేశం సరైన పని చేసిందని తాను నమ్ముతున్నట్లు మన్మోహన్ తెలిపారు. శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూనే మన సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలకు అగ్రస్థానం ఇవ్వడం మంచి విషయం అన్నారు.జీ20 భద్రతకు సంబంధించిన వైరుధ్యాలను పరిష్కరించడానికి వేదికగా గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. జీ20 భద్రతా విభేదాలను పక్కనబెట్టి, విధాన సమన్వయంపై దృష్టి పెట్టడం ముఖ్యమన్నారు. వాతావరణం, అసమానత మరియు ప్రపంచ వాణిజ్యంలో విశ్వాసం యొక్క సవాళ్లన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+