రాజస్ధాన్ మాజీ సీఎంకు స్వైన్ ప్లూ, బీజేపీపై ఆరోపణలు
జైపూర్: భారతదేశంలో స్వైన్ ప్లూ మరింతగా విజృంభిస్తుంది. తాజాగా, రాజస్ధాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు స్వైన్ ప్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఫలితం పాజిటివ్ అని తేలింది. ఆయన రక్త నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం ఢిల్లీ పంపించారు.
తన ఆరోగ్య పరిస్ధితిపై ఆదివారం మాజీ ముఖ్యమంత్రి ట్విట్టర్లో స్పందించాడు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడంతో త్వరగా కోలుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, బీజేపీపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వైన్ ప్లూ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరైన అవగాహన కార్యక్రమలు చేపట్టం లేదని ఆరోపణలు చేశారు.

నివేదికల ప్రకారం రాజస్ధాన్లో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 1900 మందికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉండగా, వారిలో 640 మందికి పాజిటీవ్ రిపోర్టు వచ్చింది.
మరోవైపు స్వైన్ఫ్లూ రోగులకు చికిత్సను అందిస్తున్న 19 మంది డాక్టర్లకు కూడా ఈ వ్యాధి సోకింది. స్వైన్ఫ్లూ కారణంగా శనివారం ఒక్కరోజే ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ 45 మంది మృతి చెందారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications