బీజేపీకి ప్రచారం చేసిన కాంగ్రెస్ నేత
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గురువారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు విసృతంగా ప్రచారం నిర్వహించాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండగా, మెజారిటీకి 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది అయితే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లపై త్రికోణ పోటీ నెలకొంది.
ఇదిలా ఉంటే నిన్నటి వరకు బీజేపీకి ప్రచారం చేసిన ఓ నేత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిర్సా మాజీ ఎంపీ అశోక్ తన్వర్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, భూపిందర్ సింగ్ హుడా సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. గురువారం మహేందర్గఢ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అశోక్ తన్వర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

గతంలో హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తన్వర్ 2019లో వివాదంతో పార్టీని వీడారు. ఆ తర్వాత, అతను నవంబర్ 2021లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు. ఆ తర్వాత ఏప్రిల్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మారారు.ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. జింద్ జిల్లా సఫిడాన్లో బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం చేసిన కొద్ది గంటలకే తన్వర్ తిరిగి కాంగ్రెస్లోకి చేరారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించే సమయంలో, అభిమానులను వేచి ఉండమని కోరుతూ ఒక ప్రకటన చేశారు.
कांग्रेस ने लगातार शोषितों, वंचितों के हक़ की आवाज़ उठाई है और संविधान की रक्षा के लिए पूरी ईमानदारी से लड़ाई लड़ी है।
— Congress (@INCIndia) October 3, 2024
हमारे इस संघर्ष और समर्पण से प्रभावित होकर आज BJP के वरिष्ठ नेता, पूर्व सांसद, हरियाणा में BJP की कैंपेन कमेटी के सदस्य और स्टार प्रचारक श्री अशोक तंवर… pic.twitter.com/DynuJEleSE
కొద్దిసేపటి తర్వాత, తన్వర్ వేదికపై కనిపించారు. రాహుల్ గాంధీతో కరచాలనం చేస్తూ, హుడాకు అభివాదం చేస్తూ తన్వర్ తిరిగి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా హుడా మద్దతుగా అతని వీపుపై తట్టారు. 2009 లోక్సభ ఎన్నికల్లో , సిర్సా నియోజకవర్గం నుంచి 35,499 మెజార్టీతో తన్వర్ విజయం సాధించారు. అయితే ఆయన 2014 ఎన్నికల్లో చరణ్జీత్ సింగ్ రోరీ చేతిలో 1.15 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో బీజేపీకి చెందిన సునీతా దుగ్గల్ చేతిలో 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడి పలు పార్టీలో చేరారు. చివరకు ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. అశోక్ తన్వర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications