వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ ఆప్తుడైన ఐఏఎస్ కు గుండెపోటు: ఏం జరిగింది ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావుకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైనారు. వెంటనే ఆయన్ను చెన్నైలోని పోరూరు శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ ( ఆసుపత్రి)కి తరలించారు.

<strong>రండి మేడమ్ రండి: పన్నీర్ సెల్వంతో కొత్త సీఎస్, కథ ఏంటీ?</strong>రండి మేడమ్ రండి: పన్నీర్ సెల్వంతో కొత్త సీఎస్, కథ ఏంటీ?

శ్రీ రామచంద్ర ఆసుపత్రిలోని అత్యవసర వార్డు (ఐసీయూ)లో రామ్మోహన్ రావు చికిత్స పొందుతున్నారు. తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Former Tamil Nadu chief Secretary admitted to hospital in Chennai

గత బుధవారం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు రామ్మోహన్ రావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ రావు, మరి కొందరి ఇళ్లలో సోదాలు చేశారు. ఆ సమయంలో మొత్తం రూ. 30 లక్షల విలువైన కొత్త రూ. 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

<strong>జయకు సన్నిహితుడైన సీఎస్ కు శేఖర్ రెడ్డికి లింక్: బినామినా?</strong>జయకు సన్నిహితుడైన సీఎస్ కు శేఖర్ రెడ్డికి లింక్: బినామినా?

మొత్తం రూ. 5 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల పత్రాలు, ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రావును సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథన్ ను నియమించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత రామ్మోహన్ రావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు.

English summary
Sri Ramachandra Medical Centre sources confirmed that he was admitted to the intensive care unit as he felt discomfort. However, they refused to divulge more details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X