మాజీ కేంద్రమంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ కన్నుమూత.. గాంధీ కుటుంబానికి నమ్మినబంటు
మాజీ కేంద్రమంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ (73) మృతిచెందారు. గాంధీ కుటుంబానికి సతీశ్ వీరవిధేయుడు.. మూడుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలి, అమేథీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గత కొంతకాలం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అతనికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో శర్మకు సాన్నిహిత్యం ఉండేది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో పెట్రోలియం, సహాజ వాయువుల ఉత్పత్తి మంత్రిత్వ శాఖను చేపట్టారు. శర్మ ఉమ్మడి ఏపీ 1947 అక్టోబర్ 11వ తేదీన సికింద్రాబాద్లో జన్మించారు. కమర్షియల్ పైలట్గా ప్రొఫెషనల్ లైఫ్ ప్రారంభించారు. అప్పుడే రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజీవ్ హత్య తర్వాత 1991లో అమేథీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998, 2004లో అమేథీ నుంచి పోటీ చేసి.. గెిచారు. 2004 నుంచి 2016 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహించారు.

శర్మ మృతిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. శర్మ మృతిపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంతాపం తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications