ఫ్రెండ్ రూమ్ లో.. క్లాస్ మేట్స్ తో: అబ్బాయిలతో మందు కొట్టిన విద్యార్థినులు: కాలేజీ నుంచి తొలగింపు..
చెన్నై: తమ క్లాస్ మేట్స్ తో కలిసి మందు కొట్టి, చిందేసిన నలుగురు విద్యార్థినుల ఉదంతం ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయంశమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో వారు చదువుతోన్న కళాశాల యాజమాన్యం దీన్ని తీవ్రంగా పరిగణించింది.నలుగురు విద్యార్థినులు, వారితో కలిసి మందు కొట్టిన విద్యార్థులను కళాశాల నుంచి తొలగించింది.
News makers: హిందువులకు గిఫ్ట్ గా రామజన్మభూమి: వయస్సు మీద పడ్డా..పదును తగ్గని గళం: పరాశరన్..!
స్నేహితుడి గదిలో మందు పార్టీ
తమిళనాడులోని నాగపట్టిణం జిల్లా మైలాడుథురై సమీపంలోని సీతార్కాడు గ్రామంలో ఈ నెల 24వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతిష్ఠాత్మక భారతీదాసన్ యూనివర్శిటీకి అనుబంధంగా నడుస్తోన్న కళాశాలలో వారంతా చదువుకుంటున్నారు. మైలాడుథురైలోని ధర్మపురం ఆధీనం ఆర్ట్స్ కళాశాల విద్యార్థినులు వారంతా. ఈ నెల 24వ తేదీన సీతార్కాడులోని తన స్నేహితుడి గదిలో మందు పార్టీకి వెళ్లారు. స్నేహితులతో కలిసి తామూ మందు కొట్టారు. మద్యం మత్తులో రెచ్చిపోయారు.
ద స్టేట్ విమెన్
ఆ సమయంలో వారంతా కళాశాల యూనిఫాంలోనే ఉన్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను వారి ఫ్రెండ్స్ ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దానికి `ద స్టేట్ విమెన్` అనే టైటిల్ పెట్టారు. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఫేస్ బుక్, వాట్సప్ ల ద్వారా విపరీతంగా షేర్ అయింది. ఈ వీడియో భారతీదాసన్ యూనివర్శిటీ అధికారులకు చేరింది.
స్నేహితురాలి పుట్టినరోజు వేడుక
దీనిపై ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ స్వామినాథన్ ఓ నివేదికను రూపొందించి, యూనివర్శిటీ అధికారులకు పంపించారు. ఈ నివేదిక అందిన వెంటనే నలుగురు విద్యార్థినులను తొలగిస్తూ యూనివర్శిటీ రిజిస్ట్రార్ జీ గోపీనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్లామని, అక్కడ అనుకోకుండా తాము మద్యాన్ని సేవించాల్సి వచ్చిందని విద్యార్థినులు లిఖితపూరకంగా అంగీకరించినట్లు స్వామినాథన్ తెలిపారు.