వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊరేగింపులో అపశృతి: విద్యుత్ తీగలు తగలి 4గురు భక్తులు మృతి

|
Google Oneindia TeluguNews

వెల్లూరు: ఆలయంలో దేవుడి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని వెల్లూరులో ఓ ఆలయంలో జరిగిన దేవుడి ఊరేగింపులో ప్రమాదవశాత్తు విద్యుత తీగలు తగిలి నలుగురు భక్తులు మృతి చెందారు.

వివరాలిలా ఉన్నాయి. అరియూర్ గ్రామంలో జరిగే పొణ్నయమ్మన్ దేవాయ ఉత్సవంలో భాగంగా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన ఊరేగింపులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, ఈ సమయంలో కరెంటు షాక్ తగిలి నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Four persons electrocuted in temple car procession

ఊరేగింపు వాహనానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను కర్రతో పైకి ఎత్తిపట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కరెంటు వైర్లు జారి మీద పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.

ఈ క్రమంలో నలుగురు భక్తులకు విద్యుత్ తీగలడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

English summary
Four persons in a temple car procession were electrocuted when their vehicle scraped against an overhead electric wire near here, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X