ఊరేగింపులో అపశృతి: విద్యుత్ తీగలు తగలి 4గురు భక్తులు మృతి
వెల్లూరు: ఆలయంలో దేవుడి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని వెల్లూరులో ఓ ఆలయంలో జరిగిన దేవుడి ఊరేగింపులో ప్రమాదవశాత్తు విద్యుత తీగలు తగిలి నలుగురు భక్తులు మృతి చెందారు.
వివరాలిలా ఉన్నాయి. అరియూర్ గ్రామంలో జరిగే పొణ్నయమ్మన్ దేవాయ ఉత్సవంలో భాగంగా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన ఊరేగింపులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, ఈ సమయంలో కరెంటు షాక్ తగిలి నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఊరేగింపు వాహనానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను కర్రతో పైకి ఎత్తిపట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కరెంటు వైర్లు జారి మీద పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.
ఈ క్రమంలో నలుగురు భక్తులకు విద్యుత్ తీగలడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.