స్నేహమే ముఖ్యం, సరిహద్దు సహకారం: నేపాల్ ప్రధాని ఓలితో మోడీ
న్యూఢిల్లీ: భారత్తో సత్సంబంధాలకు తామెంతో ప్రాముఖ్యత ఇస్తామని నేపాల్ ప్రధాని ఓలి అన్నారు. శనివారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో నేపాల్ పెట్రోలియం ప్రొడెక్ట్స్ పైప్లైన్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 'నేపాల్ అభివృద్ధిలో భారత్ చేసిన కృషికి సుదీర్ఘ చరిత్ర ఉంది. భవిష్యత్లో ఆ దేశ అభివృద్ధికి తోడ్పాటును కొనసాగిస్తూనే ఉంటాం. నేపాల్తో జల, రైల్వే మార్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నాం. భారత్-కాఠ్మాండూను కలిపే విధంగా కొత్త రైల్వే లైను వేసేందుకు అంగీకరించాం. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన పలు ప్రాజెక్టుల అభివృద్ధి గురించి విస్తృతంగా చర్చలు జరిపాం. సరిహద్దులో భద్రత విషయంలోనూ ఒకరికొకరం సహకరించుకుంటాం' అని వ్యాఖ్యానించారు.
Cementing a unique relationship of friendship! Prime Minister of Nepal, Rt. Hon’ble K.P. Sharma Oli was accorded a ceremonial welcome @rashtrapatibhvn. PM @narendramodi received PM Oli on his first State visit since his election. pic.twitter.com/lWSFLVwQPE
— Raveesh Kumar (@MEAIndia) April 7, 2018
అనంతరం ఓలి మాట్లాడుతూ భారత్తో సంబంధాలకు నేపాల్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి భారత్తో మంచి సంబంధాలను కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని నేపాల్లో పర్యటించాల్సిందిగా ఓలి ఆహ్వానించారు.
వీలైనంత త్వరగా మోడీ నేపాల్లో పర్యటిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన నేపాల్ ప్రధాని ఓలికి శనివారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా స్వాగతం పలికారు.