నాకు టార్చర్ పెట్టారు, అందుకే, ఇలా: జయ మేనకోడలు దీపా !
తనకు చిత్రహింసలు పెట్టి మానసికంగా వేదించడం వలనే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్పష్టం చేశారు.
న్నై: తనకు చిత్రహింసలు పెట్టి మానసికంగా వేదించడం వలనే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్పష్టం చేశారు.
తమిళనాడు 2017-18 భారీ బడ్జెట్: ఎంతంటే, ప్రజలపై పన్ను !
ఇంత కాలం తన మేనత్త జయలలితను మా కుటుంబానికి దూరం చేసి నేడు అమ్మ వారసులు మేమే అని చెప్పుకుంటున్న వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని పరోక్షంగా శశికళ వర్గీయులను దీపా జయకుమార్ హెచ్చరించారు.
శుక్రవారం ఆమె చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ లోని అమ్మ అభిమానుల కోరిక మేరకే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. జయలలిత వారసులు ఎవరో ఆర్ కే నగర్ ప్రజలే నిర్ణయిస్తారని, వారి ఓటు హక్కు దుర్వినియోగం చేసుకోరనే నేను నమ్ముతున్నానని దీపా అన్నారు.
శశికళకే ఝలక్: చెప్పకుండానే దినకరన్ పోటీనా, మండిపడిన చిన్నమ్మ !
మీకు పోటీగా పన్నీర్ సెల్వం మరో సీనియర్ నాయకుడు మధుసూదనన్ ని పోటీలో నిలిపారని మీడియా ప్రశ్నించగా ఆ విషయం వారినే అడగాలని దీపా సమాదానం దాటవేశారు. మొత్తం మీద దీపా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ కు చుక్కలు చూపించడానికి సిద్దం అవుతున్నారు.