మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించేందుకు మావోల ప్లాన్, కుట్రభగ్నం చేసిన పోలీసులు
మరో 17 రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ దాడి చేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టడంతో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించింది. దీంతో సరిహద్దు ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.
ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఓకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో గడ్చిరోలి జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు వ్యుహరచన చేశారు. మావోయిస్టుల కుట్రను కొందరు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల శిబిరంలో 15 చేతి గ్రనేడ్లు, 15 జిలేటిన్ స్టిక్స్, ఒక ప్రెషర్ కుక్కర్ బాంబ్, ఆరు కిలోల మందుగుండు, ఐఈడీ డిటోనేటర్, ఆర్ఎఫ్ఐడీ స్విచ్, మావోయిస్టుల సాహిత్యం, యూనిఫామ్స్ లభించాయి.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ బరిలోకిదిగాయి. బీజేపీ 164, శివసేన 124 చోట్ల పోటీ చేస్తామని స్పష్టతనిచ్చాయి. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి కీలక నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీలు బలమైన అభ్యర్థుల వేటలో పడిపోయాయి. బీజేపీ-శివసేన కూటమికి గట్టి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications