గాంధీకి ఇష్టమైన ట్యూన్ తొలగింపు: బీటింగ్ రీట్రీట్ నుంచి డ్రాప్, విమర్శలు
మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా బీటింగ్ రీట్రిట్ సైన్యం నిర్వహిస్తారు. ఏటా జనవరి 29వ తేదీ సాయంత్రం విజయ్ చౌక్లో నిర్వహిస్తారు. ఈ సారి కూడా కండక్ట్ చేస్తారు.. కానీ అందులో ఒక ఫేమస్ బీట్ తొలగించారు. అదీ కూడా జాతి పిత మహాత్మా గాంధీకి ఇష్టమైన బీట్ అదీ.. దీంతో మోడీ సర్కార్ మరోసారి విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యిందని చెప్పాల్సి ఉంటుంది.
బీటింగ్ రీట్రీట్ ముగింపు వేడుకల్లో ఇదివరకు అబిడ్ విత్ మి గంభీరమైన శ్లోకం వినిపించేంది. ఇదీ శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీనిని తొలగించడం విమర్శలకు తావిస్తోంది. ఇండియా గేట్ వద్ద గల అమర్ జవాన్ జ్యోతిని సమీపంలో గల నేషనల్ వార్ మెమోరియల్కు తరలించారు. దీనిపై దుమారం చెలరేగింది. ఆ వెంటనే మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మొదటి ప్రపంచ యుద్దం, ఆంగ్లో ఆప్ఘన్ యుద్దంలో బ్రిటిష్ వారి కోసం పోరాడిన కొందరు అమరవీరుల పేర్లు అక్కడ చెక్కబడ్డాయి. ఇదీ వారి త్యాగానికి చిహ్నాం.. 74 వేల మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్దంలో పోరాడి చనిపోయారు. బెల్జియం, ప్రాన్స్ జరిగిన గొప్ప యుద్దాలలో పాల్గొన్నారు.
రెండో ప్రపంచ యుద్దంలో 87 వేల మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారు. వారు కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ ద్వారా గౌరవించబడ్డారు. వాస్తవానికి బీటింగ్ రీట్రిట్ పాశ్చాత్య ధోరణితో ఉన్న.. దానికి సంబంధించి ట్యూన్ మాత్రం భారతీయ ట్యూన్ కలిగి ఉన్నాయి. అందులో గల అబిడ్ విత్ మి అనేది గాంధీజీ ఇష్టం.. దానినే తొలగించే సాహసం మోడీ సర్కార్ చేసింది.