13 మంది మృతి.. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
కూనూరు వద్ద కూలిన హెలికాప్టర్ నుంచి ప్రత్యక్ష సాక్షులు వివరాలు తెలియజేశారు. హెలికాప్టర్ కిందకు రావడాన్ని అక్కడున్న వారు గమనించారు. అయితే అందులో ఉన్న వారు అరుస్తున్నారని కృష్ణస్వామి అనే ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తొలుత హెలికాప్టర్ పెద్ద చెట్టును ఢీ కొందని వివరించారు. ఢీ కొని కూలిపోయిందని.. వెంటనే మంటలు వచ్చాయని వివరించారు. అంతకుముందు అందులో ఉన్న వారంతా అరిచారని తెలిపారు.
ముగ్గురు కాలిపోతూ కిందకి రావడం తాను చూశానని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేశాం అని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రమాదం జరిగిందని.. స్వామి తెలిపారు. తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. హెలికాప్టర్ కూలిన తర్వాత ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు మంటలు అంటుకున్నాయని ఆయన తెలిపారు. తమ చుట్టు పక్కల ఉండేవారిని సాయం చేసేందుకు పిలిచానని తెలిపారు. ఫైరింజన్, అత్యవసర సేవలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని పేర్కొన్నారు.

తమిళనాడు కూనూరు దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు వున్నారు. ప్రమాదంలో 13 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారు. హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. ఒక్కరే ప్రాణాలతో బయటపడి చికిత్స తీసుకుంటున్నారు. వారు బిపిన్ రావత్ అన్నారు. రావత్ భార్య మధులిక కూడా చనిపోయినట్టు తెలుస్తోంది.
రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. తొలుత రావత్ ఇంటికి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లారు. ముంబై పర్యటనను రాష్ట్రపతి కోవింద్ రద్దు చేసుకొని.. ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రధాన మంత్రి మోడీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. భేటీ తర్వాత ప్రమాదం గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటు రేపు పార్లమెంట్లో ప్రమాద ఘటన గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications