రండి మేడమ్ రండి: పన్నీర్ సెల్వంతో కొత్త సీఎస్, కథ ఏంటీ ?
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో తమిళనాడు సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత గిరిజా వైద్య నాథన్ ను పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అభినందించారు.
అనంతరం గిరిజా వైద్యనాథన్ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కలుసుకున్నారు. ఈ సందర్బంగా మీకు ఉద్యోగరీత్యా అంతా మంచే జరగాలని పన్నీర్ సెల్వం గిరిజా వైద్యనాథన్ తో అన్నారు. ఇదే సమయంలో సీఎం పన్నీర్ సెల్వంతో గిరిజా వైద్యనాథన్ చర్చించారు.

తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల గురించి ఇద్దరూ చర్చించారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ది పనులకు తాను పూర్తిగా సహకరిస్తానని ఇదే సమయంలో గిరిజా వైద్యనాథన్ సీఎం పన్నీర్ సెల్వంకు హామి ఇచ్చారని సమాచారం.
అనంతరం గిరిజా వైద్యనాథన్ విధులలో నిమగ్నం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చెయ్యడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న రామ్మోహన్ రావు పదవి ఊడిపోయిన విషయం తెలిసిందే. రామ్మోహన్ రావు స్థానంలో గిరిజా వైద్యనాథన్ భాద్యతలు స్వీకరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications