Nurse: అమ్మాయి మీద ఆసుపత్రి ఉద్యోగి కన్ను, నమ్మించి రేప్, పోలీసుల భయంతో నదిలో !
బెంగళూరు/బళ్లారి/బాగల్ కోటే: ఉద్యోగానికి వెళ్లిన నర్సు తిరిగి ఇంటికి చేరుకోలేదు. అమ్మాయి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కనపడకుండా పోయిన నర్సు శవం నది సమీపంలోని వంతెన కింద చిక్కింది. అమ్మాయిపై అత్యాచారం చేసిన అదే ఆసుపత్రిలోని కామాంధుడు పోలీసులకు చిక్కిపోతామనే భయంతో ఆమెను చంపేసి శవం తీసుకెళ్లి నది సమీపంలోని వంతెన కింద విసిరేయడం, అత్యాచారం, హత్యకు గురైన యువతి దళితురాలు కావడంతో కలకం రేపింది.

నర్సు ఉద్యోగం
కర్ణాటకలోని భాగల్ కోటేకి చెందిన 22 ఏళ్ల యువతి నర్సింగ్ పూర్తి చేసింది. దళితురాలైన ఆ యువతి మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆశపడింది. భాగల్ కోటేలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ అమ్మాయి నర్సుగా ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు ఆ అమ్మాయి ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది.

మాయం అయిన అమ్మాయి
ఇంటి నుంచి ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిన ఆ అమ్మాయి తరువాత ఇంటికి వెళ్లలేదు. అమ్మాయి కోసం ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మీ అమ్మాయి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిపోయిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అమ్మాయి కోసం బంధువులు, ఆమె స్నేహితుల ఇళ్లలో వెతికిన కుటుంబ సభ్యులు చివరికి బాగల్ కోటే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రేప్ చేసి చంపేశారు
కేసు నమోదు చేసిన పోలీసులు కనపడకుండా పోయిన నర్సు కోసం గాలించారు. అదే సమయంలో భాగల్ కోటే జిల్లాలోని ఘటప్రభా నది సమీపంలోని ముథొళ తాలుకాలోని అంకలగి వంతెన కింద నర్సు శవమై కనిపించింది. హత్యకు గురైయ్యింది నర్సు అని వెలుగు చూడటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

ఆసుపత్రిలోనే కామాంధుడు
అత్యాచారం చేసి హత్యకు గురైన నర్సు ఆసుపత్రిలో పని చేస్తున్న హనీఫ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సు మీద చాలాకాలం నుంచి కన్ను వేసిన హనీఫ్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి బైక్ లో పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది.

పోలీసుల భయంతో హత్య
అమ్మాయి విషయం బయటకు చెబుతుందనే భయంతో హనీఫ్ ఆమెను చంపేసి శవం నది సమీపంలోని వంతెన కింద పడేశాడని పోలీసులు అన్నారు. హత్యకు గురైన యువతి దళితురాలు కావడం కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఆర్.బి. తిమ్మాపుర కర్ణాటక ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి మనవి చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications