అపహరించి అమ్మాయిపై గ్యాంగ్ రేప్, ముంబైకి తరలింపు
ముంబై: గోరెగావ్ స్టేషన్ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ అమ్మాయిని ఆదివారంనాడు విచారించిన పోలీసులకు నమ్మశక్యం కాని నిజం తెలిసింది. దీంతో బోరివిలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆ అమ్మాయి తల్లితండ్రులకు సమాచారం అందించారు. ఉత్తర ప్రదేశ్లోని కల్వార్ ప్రాంతంలో నివసిస్తున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసి అక్కడి నుండి ముంబైకి అక్రమంగా రవాణా చేసి గోరెగావ్ స్టేషన్ ప్రాంతంలో వదిలి వెళ్లారు. ఈ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు.
పోలీసుల సమాచారం ప్రకారం ఆగస్టు 17వ తారీఖున ఈ అమ్మాయిని తన ఇంటి వద్ద నుండి ఏడుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. అక్కడ నుండి ఆమెను లక్సోకి తీసుకోని వెళ్లి ఆగస్టు 17 నుండి 19వ తారీఖు వరకు గ్యాంగ్ రేప్ చేశారని తెలుస్తోంది.
ఆ తర్వాత లక్నో నుండి అమ్మాయిని ముంబైకి తరలించారు. ఐతే ముంబైలో ఏ రైల్వే స్టేషన్ లో తనని వదిలిపెట్టిన విషయాన్ని మాత్రం తను గుర్తుపట్టలేకుందన్నారు. కొన్ని రోజులు తర్వాత తాను ఉత్తర ప్రదేశ్ కి తిరిగి వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ ఏ రైళ్లు వెళతాయో తెలియక తికమకపడుతూ అక్కడే తిరుగుతుండటంతో ఆదివారం నాడు పోలీసులు అమ్మాయిని విచారించడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది.
దీంతో అమ్మాయి తినడానికి ఆహారం ఇచ్చామని, దాంతో పాటు వైద్య పరీక్షలకు పంపామన్నారు. సామూహిక అత్యాచారం జరిగినట్లుగా నిర్దారణ అయిందన్నారు. ఆ అమ్మాయి తరుపు బంధువులు ముంబై వస్తున్నారని ఎపైఆర్ రిజిస్టర్ చేసిన డీసీపీ దీపక్ రాజ్ వెల్లడించారు.