వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపహరించి అమ్మాయిపై గ్యాంగ్ రేప్, ముంబైకి తరలింపు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: గోరెగావ్ స్టేషన్ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ అమ్మాయిని ఆదివారంనాడు విచారించిన పోలీసులకు నమ్మశక్యం కాని నిజం తెలిసింది. దీంతో బోరివిలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆ అమ్మాయి తల్లితండ్రులకు సమాచారం అందించారు. ఉత్తర ప్రదేశ్‌లోని కల్వార్ ప్రాంతంలో నివసిస్తున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసి అక్కడి నుండి ముంబైకి అక్రమంగా రవాణా చేసి గోరెగావ్ స్టేషన్ ప్రాంతంలో వదిలి వెళ్లారు. ఈ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు.

పోలీసుల సమాచారం ప్రకారం ఆగస్టు 17వ తారీఖున ఈ అమ్మాయిని తన ఇంటి వద్ద నుండి ఏడుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. అక్కడ నుండి ఆమెను లక్సోకి తీసుకోని వెళ్లి ఆగస్టు 17 నుండి 19వ తారీఖు వరకు గ్యాంగ్ రేప్ చేశారని తెలుస్తోంది.

Girl gang raped brought to Mumbai for trafficking

ఆ తర్వాత లక్నో నుండి అమ్మాయిని ముంబైకి తరలించారు. ఐతే ముంబైలో ఏ రైల్వే స్టేషన్ లో తనని వదిలిపెట్టిన విషయాన్ని మాత్రం తను గుర్తుపట్టలేకుందన్నారు. కొన్ని రోజులు తర్వాత తాను ఉత్తర ప్రదేశ్ కి తిరిగి వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ ఏ రైళ్లు వెళతాయో తెలియక తికమకపడుతూ అక్కడే తిరుగుతుండటంతో ఆదివారం నాడు పోలీసులు అమ్మాయిని విచారించడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది.

దీంతో అమ్మాయి తినడానికి ఆహారం ఇచ్చామని, దాంతో పాటు వైద్య పరీక్షలకు పంపామన్నారు. సామూహిక అత్యాచారం జరిగినట్లుగా నిర్దారణ అయిందన్నారు. ఆ అమ్మాయి తరుపు బంధువులు ముంబై వస్తున్నారని ఎపైఆర్ రిజిస్టర్ చేసిన డీసీపీ దీపక్ రాజ్ వెల్లడించారు.

English summary
A teenaged girl, found roaming alone at Goregaon station on Sunday, narrated a horrifying story to the cops of being gangraped in Uttar Pradesh and brought to Mumbai for trafficking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X