బాలికను కిడ్నాప్ చేసి చెరుకు తోటలో రేప్
నోయిడా: బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు రేప్ చేసిన సంఘటన గ్రేటర్ నోయిడా లో జరిగింది. బాలిక మీద అత్యాచారం చేసిన నిందితుడిని స్థానికులు పట్టుకుని చితబాది పోలీసులకు అప్పగించారు.
నోయిడాలో నివాసం ఉంటున్న బాలిక (13)ను నిందితుడు తపాల్ రోడ్డు మార్కెట్ దగ్గర సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశాడు. తరువాత బాలికను వాహనంలో యమునా ఎక్స్ ప్రెస్ హై వే రోడ్డు మీదుగా తీసుకు వెళ్లాడు.
హై వే సమీపంలోని చెరుకు తోటలో బాలికను తాళ్లతో కట్టివేసి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయకుండా నోటిలో బట్టలు కుక్కాడు. అటు వైపు వెలుతున్న గ్రామస్తులు విషయం గుర్తించారు.
గ్రామస్తులు పట్టుకుంటారని భయపడిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారని జిల్లా ఎస్పీ అభిషేక్ యాదవ్ చెప్పారు.
అరెస్టు అయిన నిందితుడి పేరు ఆశిష్ భాఠీ అని ఎస్పీ అభిషేక్ యాదవ్ అన్నారు. బాలికకు వైద్య పరిక్షలు చేయించామని, అత్యాచారం జరిగిందని వెలుగు చూసిందని పోలీసు అధికారులు తెలిపారు.