కరువు: పెళ్లి చేసుకోవొద్దని యువతుల నిర్ణయం
బీడ్: మహారాష్ట్రలో మరాఠ్వాడ ప్రాంతంలోని యువతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకోరాదని బీడ్ జిల్లాలోని మాజల్ గావ్ ప్రాంతానికి 25మంది యువతులు నిర్ణయించుకున్నారు. కరువుతో తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో వారు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
తమకు పెళ్లిళ్లు చేయలేక తమ తల్లిదండ్రులు విపరీత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారనే భయంతో వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నట్లు యువతులు తెలిపారు. తమ గ్రామంలో 20నుంచి 25 మంది అమ్మాయిలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సరిత అనే యువతి వెల్లడించింది.

ప్రభుత్వ సాయం కోరుకుంటున్నామని తెలిపింది. రెండుమూడేళ్ల నుంచి కరువు తీవ్రంగా ఉందని సవిత అనే మరో యువతి తెలిపింది. తమ తల్లిదండ్రులు ఏడాదంతా కష్టపడితే రూ. 30 వేలు వస్తాయని, ఈ డబ్బు తమ అవసరాలకే సరిపోవడం లేదని... ఇక పెళ్లిళ్లు ఎలా చేస్తారని వాపోయింది.
మరాఠ్వాడ ప్రాంతంలోని లాటూర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాల్లో కరువు పరిస్థితులు దారుణంగా మారడంతో రైతులు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లిపోతున్నారు. కాగా, తీవ్ర కరువుతో జనవరి 1 నుంచి ఇప్పటివరకు మరట్వాడా ప్రాంతంలో 124 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Around 20-25 women Majalgaon area in Beed hv decided not to marry due to weak financial condition of their families pic.twitter.com/oeIC9l6uBi
— ANI (@ANI_news) February 28, 2016
My parents hardly make 30,000 a year as this area has been drought-hit since 2-3 yrs: Savita,Majalgaon area resident pic.twitter.com/WyjiZ1nH3R
— ANI (@ANI_news) February 28, 2016
There are 20-25 girls in this village and we all have decided to not marry. We want Govt to help us: Sarita pic.twitter.com/n2BkBC6ntL
— ANI (@ANI_news) February 28, 2016












Click it and Unblock the Notifications