Goa: ఆ రోజు గుడ్డి బిల్డప్, కళ్లు తెరిచిన కాంగ్రెస్, ఫలితాలకు ముందే ?, మోదీ మైండ్ గేమ్ తో అలర్ట్, ఎమ్మెల్యేలు
గోవా/బెంగళూరు/న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో ఆ ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి ఎవరు వస్తారా ? అనే ఉత్కంఠ మొదలైయ్యింది. ఐదు రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓటరు మహానుభావులు ఎవరిని కరుణించారు, ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం ఈనెల 10వ తేదీన వెలుగు చూడనుంది. గతంతో గోవా శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ గుడ్డి బిల్డప్ ఇచ్చి చితకలపడింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో విఫలం అయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీ ఆడిన మైండ్ గేమ్ లో చితకలపడింది. ఐదు సంవత్సరాలు గోవాలో అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు ముందే ఆ పార్టీ నాయకుల మనసులో మాట బయటపెట్టారు.
మా పార్టీకి మెజారీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర పార్టీలతో కలిసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఈసారి బీజేపీకి మాత్రం ఆ చాన్స్ ఇవ్వమని అంటున్నారు. అంటే గోవాలో మా పార్టీ మెజారీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేరు అని కాంగ్రెస్ పరోక్షంగా అంగీకరిస్తోందే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోవాలో 40 మంది శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2017లో గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల గుడ్డి బిల్డప్ ఇవ్వడంతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో మనోహర్ పారికర్ సీఎం అయిపోయారు. అయితే 2017లో జరిగిన మాయాజాలం ఇప్పడు జరగకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, గోవా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దినేష్ గుండూరావ్ అంటున్నారు. గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ బీజేపీ గూటికి చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది.

మార్చి 10వ తేదీ విడుదల
ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో ఆ ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి ఎవరు వస్తారా ? అనే ఉత్కంఠ మొదలైయ్యింది. ఐదు రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓటరు మహానుభావులు ఎవరిని కరుణించారు, ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం ఈనెల 10వ తేదీన వెలుగు చూడనుంది.

గోవాలో కాంగ్రెస్ పార్టీ గుడ్డి బిల్డప్
గతంతో గోవా శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ గుడ్డి బిల్డప్ ఇచ్చి చితకలపడింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో విఫలం అయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీ ఆడిన మైండ్ గేమ్ లో చితకలపడింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, గోవా బీజేపీ నాయకుడు మనోహర్ పారికర్ అప్పట్లో ఆడిన మైండ్ గేమ్ తో కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగిపోయింది.

ఇతర పార్టీల మద్దతు తీసుకుంటాము
ఐదు సంవత్సరాలు గోవాలో అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు ముందే ఆ పార్టీ నాయకుల మనసులో మాట బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి, గోవా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దినేష్ గుండూరావ్ శనివారం మీడియాతో మాట్లాడారు. మా పార్టీకి మెజారీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర పార్టీలతో కలిసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఈసారి బీజేపీకి మాత్రం ఆ చాన్స్ ఇవ్వమని దినేష్ గుండూరావ్ అన్నారు. అంటే గోవాలో మా పార్టీ మెజారీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేరు అని కాంగ్రెస్ పరోక్షంగా అంగీకరిస్తోందే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గోవా లెక్కలు ఇవే
గోవాలో 40 మంది శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2017లో గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల గుడ్డి బిల్డప్ ఇవ్వడంతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో మనోహర్ పారికర్ సీఎం అయిపోయారు.

ఈసారి బీజేపీకి ఏమాత్రం చాన్స్ ఇవ్వం
2017లో జరిగిన మాయాజాలం ఇప్పడు జరగకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, గోవా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దినేష్ గుండూరావ్ అంటున్నారు. గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ బీజేపీ గూటికి చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది.
Recommended Video

కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలు పెట్టుకున్న పార్టీలు ఇవే
అమ్ ఆద్మీ పార్టీ (AAP), గోవాకు చెందిన ఎంజీపీ, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (MGP), మమతా బెనర్జీకి చెందిన టీఎంపీ పార్టీల మద్దతుతో గోవాలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మెజారీ ఎమ్మెల్యేలు ఉంటే అదే రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, మెజారిటీ ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే మిగిలిన పార్టీల ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని రెండు మూడు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, గోవా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దినేష్ గుండూరావ్ అంటున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications