బీచ్లో ఘోరం: రేప్? రక్తపు మడుగులో నగ్నంగా విదేశీ యువతి
ఓ విదేశీ యువతి రక్తపు మడుగులో నగ్నంగా పడివుండటం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన గోవాలో చోటు చేసుకుంది.
పనాజీ: ఓ విదేశీ యువతి రక్తపు మడుగులో నగ్నంగా పడివుండటం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన గోవాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్కు చెందిన ఓ మహిళ తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఇటీవల గోవాకు వచ్చింది. వాళ్లిద్దరూ సోమవారం స్థానికంగా జరిగిన హోలీ వేడుకల్లో కూడా పాల్గొన్నారు.
వేడుకల అనంతరం ఆమె కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం ఆమె మృతదేహం నగ్నంగా బీచ్లోని నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఘటపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు ముందు అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. హోలీ వేడుకల్లో ఆమె ఎవరితో సన్నిహితంగా ఉందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
మృతురాలి స్నేహితుడిని కూడా విచారించారు. అతడు తెలిపిన వివరాల మేరకు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని డీసీపీ సమ్మీ టావరేస్ తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications