పోలీస్ స్టేషన్ లో మిని స్కర్ట్ రాధే మా
ముంబై: ఆధ్యాత్మిక దేవత రాదే మా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ పోలీసుల ముందు విచారణకు హాజరైనారు. ఆమె వెంట కొందరు భక్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే భక్తులను పోలీసులు పోలీస్ స్టేషన్ లోకి అనుమతి ఇవ్వలేదు.
శుక్రవారం ఉదయం రాధే మా తన న్యాయవాదులు, భక్తులను వెంట పెట్టుకుని ముంబైలోని కండ్లివి పోలీస్ స్టేషన్ చేసుకున్నారు. తరువాత ఇప్పటికే నమోదు అయిన వరకట్నం వేదింపుల కేసుకు సంబంధించి రాధే మాను పోలీసు అధికారులు విచారణ చేశారు.
ఆ సందర్బంలో ఆమె న్యాయవాదులు అక్కడే ఉన్నారు. విచారణ చేసిన పోలీసులు రాధే మా స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు. ఆ సందర్బంలో భక్తులను పోలీస్ స్టేషన్ లోకి అనుమతించలేదు. రాధే మా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లిన సమయంలో స్థానికులు స్టేషన్ ముందు పెద్ద సంఖ్యలో గుమికూడారు.
నిక్కీ గుప్తా ఫిర్యాదు చేసిన వరకట్నం వేదింపుల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిక్కీ గుప్తా కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి చెయ్యలేదని రాధే మా పోలీసుల ముందు చెప్పారని సమాచారం. వివాహం సందర్బంగా తన కుటుంబ సభ్యులు రూ. 102 కోట్ల బంగారం నగలు కట్నంగా తన భర్త నకుల్ కు ఇచ్చారని నిక్కీ గుప్తా ఫిర్యాదులో తెలిపింది.