ఎల్ ఈ డీ లైట్లు, శరీరభాగాల్లో కూడ,బంగారమిలా...పోలీసులకు అలా..
ఎల్ ఈ డీ లైట్లతో పాటు, శరీరభాగాల్లో బంగారం బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తోన్న ఓ వ్యక్తిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు.
శంషాబాద్:బంగారం అక్రమ రవాణకు స్మగ్లర్లు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. రెండు కిలోల బంగారాన్ని ఎల్ ఈ డీ లైట్లలో తరలిస్తోన్న ఓ వ్యక్తిని శంఫాబాద్ లో అరెస్టు చేశారు.
సింగపూర్ నుండి టైగర్ ఎయిర్ వేస్ కు చెందిన టిఆర్ 2624 విమానంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు.విమానాశ్రయంలో పోలీసులు తనిఖీ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
ఎల్ ఈ డీ లైట్లలో బంగారం బిస్కెట్లను అమర్చాడరు. శరీరభాగాల్లో కూడ బంగారాన్ని పెట్టుకొన్నాడు. ఈ బంగారాన్ని ఆయన స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడి నుండి 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ బంగారం విలువ రూ.59.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఎల్ ఈ డీ లైట్లలోపల 8 శరీరభాగాల్లో 12 బంగారు బిస్కట్లను గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. ఇదే తరహలో ముంబాయి విమానాశ్రయంలో ఇటీవలనే బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
బంగారం అక్రమ రవాణకు స్మగ్లర్లు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. రెండు కిలోల బంగారాన్ని ఎల్ ఈ డీ లైట్లలో తరలిస్తోన్న ఓ వ్యక్తిని శంఫాబాద్ లో అరెస్టు చేశారు.